తెలంగాణ ఆంధ్రాల మధ్య ఇప్పుడు గిఫ్ట్ మ్యాటర్ ఎక్కువ అవుతోంది.ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తన మీద ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేసి … తన ఇగో హర్ట్ చేసినందుకు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే…కేసీఆర్ ఇవ్వబోయే గిఫ్ట్ ఏంటా అని అంతా… ఆలోచనలో పడ్డారు.
ఈ సంగతి ఇలా ఉంటే… బాబు కూడా ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వబోతున్న అంటూ ప్రకటించాడు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు గిఫ్ట్స్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించాడు.
సత్తెనపల్లిలో జరిగిన ఎన్.టి.ఆర్.విగ్రహావిష్కరణ సభలో మాట్లాడిన బాబు ఈ వ్యాఖ్యలు చేసాడు.గతంలో కెసిఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారని,చివరికి తన వద్ద పనిచేసి, తాను పెంచితే పెరిగి,తననే నోటికి వచ్చినట్లు మాట్లాడారని ఆయన అన్నారు.ఆయన రిటర్న్ గిప్ట్ ఇస్తానంటున్నారని, తాము ఏమైనా చేతకానివారమా ? మూడు రిటర్న్ గిప్ట్ లు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.ప్రధాని మోదీ సీనియర్ మోదీ అయితే కెసిఆర్ తెలంగాణ మోదీ ,జగన్ ఆంధ్రా మోదీ అని, వీరు ముగ్గురు మన మీద పడుతున్నారని, వీరంతా కలిసినా తమకు ఎలాంటి భయం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.