ఏపీలో మంత్రి వర్గ విస్తరణ విషయం మళ్ళీ తెరమీదకి వచ్చింది.అంతేకాదు చాలా మంది సీనియర్ మంత్రులకి ఉద్వాసన తప్పదని భావిస్తున్నారు చాలా మంది సీనియర్ మంత్రుల విషయంలో చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారన్న విషయం వేరే చెప్పవలసిన అవసరం లేదు.
చాలా సందర్భంలో చంద్రబాబు నాయుడు అనేక సార్లు మంత్రుల పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు కూడా.రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు భారీ మార్పులు చేపట్టనున్నారు అని తెలుస్తోంది
లోకేష్ ఈ మధ్య మాట్లాడుతూ మంత్రి వర్గ విస్తరణ లేనే లేదు అంటూ తేలిచి చెప్పినా అది కేవలం పై పై మాటలు అని తెలుస్తోంది.
ఎవరికి కొత్త మంత్రులుగా అవకాశం కలిపిస్తారు అనే విషయం పక్కన పెడితే ఎవరి సీటుకి బాబు ఎర్త్ పెడుతున్నారు అనే విషయంలో మాత్రం.కొంతమంది సీనియర్స్ పేర్లు బయటకి వస్తున్నాయి.
ముఖ్యమంత్రి లిస్టు లో ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు శిద్దారఘవరావు,పి.నారాయణ ,భుమా అఖిల ప్రియా ,ఘంటా శ్రీనివాసరావు, అచ్చేన్నాయుడు,అయ్యన్న పాత్రుడు ,నక్కా అనందబాబు , పేర్లు వినిపిస్తున్నాయి
మంత్రులు అందరిలో మోస్ట్ సీనియర్ మంత్రి అయిన యనమల రామకృష్ణుడు రాజ్యసభకు వెళ్ళిపోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు.
ఇక అచ్చెన్నాయుడు, నారాయణ, శిద్ధా రాఘవరావు, గంటా లేక చింతకాయల్లో ఒకరిని వచ్చే ఎన్నికల్లో పార్టీ యొక్క పటిష్టతక వాడుకోవడం మంచిది అని భావిస్తున్నారు చంద్రబాబు.అయితే మంత్రి వర్గం లో చోటు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు కాబట్టి సీనియర్స్ లో పదవులు ఎప్పటి నుంచో వారికి ఈ సారి మంత్రి వర్గంలో చోటు ఇవ్వనున్నారు.
ఆశిస్తున్న వారిలో బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణ ,గౌతు శ్యామసుందరావు ,కాగితం వెంకట్రావు ,తదితరులు ఉన్నారు.ఒక వేళ సీనియర్స్ ని కనుక ఈ సమయంలో సంతృప్తి పరచకపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు.
అనేక ఈక్వేషన్స్ ప్రకారం అలోచించి మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు అని తెలుస్తోంది.అయితే వచ్చే డిసెంబర్ లోనే ఈ మార్పులు ఉంటాయని.
వచ్చే ఎన్నికలకి ఈ సారి ఏర్పడబోయే టీం వర్క్ చేస్తుందని టాక్.మరి ఈ విస్తరణలో పదవులు దక్కించుకునేది ఎవరు? పదవులు పోగొట్టుకుంది ఎవరు అనేది ఇంకా స్పష్టంగా తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.