ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణనీ అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల పదవ తరగతి పరీక్షల పత్రాల లీకేజ్ ఘటనకు సంబంధించి నారాయణ విద్యా సంస్థలకు సంబంధం ఉందని విచారణలో తేలడం తో.
ఏపీ సిఐడి అధికారులు హైదరాబాద్ కొండాపూర్ కి వెళ్లి మాజీ మంత్రి నారాయణ ను అదుపులోకి తీసుకున్నారు.పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ప్రారంభంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
కొంతమంది ఉపాధ్యాయులు వాట్సాప్ ద్వారా పలువురికి ప్రశ్నాపత్రాలను పంపిన విషయం తెలిసిందే.అయితే ఈ వ్యవహారంలో పది మంది ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేయడం జరిగింది.అరెస్టయిన ఉపాధ్యాయులలో నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు.ఇదిలా ఉంటే మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన సతీమణి రామా దేవిని సైతం హైదరాబాద్ నుండి ఏపికి సీఐడీ పోలీసులు తరలిస్తున్నట్లు సమాచారం.
ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఓ బహిరంగసభలో సీఎం వైఎస్ జగన్ కుట్ర పూరితంగా టీడీపీ నేతలు చేసినట్లు ఆరోపణలు చేయడం జరిగింది.ఈ క్రమంలోనే నారాయణ విద్యాసంస్థల అధినేత టీడీపీ నేత.మాజీ మంత్రి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.