ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సీఆర్డీఏ రద్దు బిల్లు కు హైకోర్టు బ్రేక్ వేసింది.దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసుపై సత్వరమే విచారణ చేపట్టాలని తాజాగా సుప్రీం ధర్మాసనంకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ కూడా రాసింది.
ఇంకా దానిపై విచారణ మొదలవ్వకపోవడంతో విశాఖపట్నంలో ఈ నెల 16న జరగవలసి ఉన్న శంకుస్థాపనకు బ్రేక్ పడింది.ఈ శంకుస్థాపనకు జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవ్వాలని కోరారు.
మరి అలాంటి అంశం ఇక ఇప్పుడు కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఇలాంటి టైంలో బ్రేక్ పడిన శంకుస్థాపన ఎప్పుడు జరుపుతారని ఏపీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ప్రస్తుతం ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం ఈ శంకుస్థాపన కార్యాన్ని దసరాకి నిర్వహించాలని భావిస్తున్నట్టు దానికి తగ్గట్టు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే రాజధాని అంశంలో పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రభస జరుగుతుంది.
మరి అలాంటి రాజధాని అంశం ప్రభుత్వం భావించినట్టు దసరా కైనా ఓ కొలిక్కి వస్తుందో లేదో వేచి చూడాలి.