హైదరాబాద్ బయట ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగిందంటే నగర శివార్లలో అని అర్థం కాదు.ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది.
రాష్ర్టం విడిపోయాక ఏపీ కేబినెట్ భేటీ ఆంధ్రాలో జరగడం ఇది రెండోసారి.ఇదివరకు ఒక సమావేశం విశాఖపట్నంలో నిర్వహించారు.
గోదావరి పుష్కరాల ప్రారంభం రోజునే దుర్ఘటన జరిగిన రాజమండ్రిలోనే కేబినెట్ సమావేశం నిర్వహించడం విశేషం.పుష్కరాల్లో దుర్ఘటన జరగకుండా ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు పుణ్యస్నానం ముగించుకొని నేరుగా హైదరాబాదుకు వచ్చివుండేవారేమో.
కాని దుర్ఘటన జరిగి ముప్పయ్ మంది చనిపోవడంతో షాక్కు గురైన బాబు పుష్కరాలు ముగిసేంతవరకూ అక్కడే ఉండి పర్యవేఓఇంచాలని అనుకున్నారేమో.అందుకే మంత్రివర్గ సమావేశం కూడా అక్కడే నిర్వహించారు.
ఆంధ్ర రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ బృందానికి అప్పగించే విషయం మీద, పుష్కర దుర్ఘటన మీద ఈ మీటింగులో చర్చించారు.దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక రేపు (శనివారం) అందుతుందని అనుకుంటున్నారు.
మిగిలిన రోజుల్లో పుష్కరాలు సజావుగా జరిగే ఏర్పాట్లపై కేబినెట్ భేటీలో చర్చించారు.ప్రస్తుతం రాజమండ్రిలోనే ఉన్న బాబు పరిపాలన అక్కడి నుంచే కొనసాగిస్తున్నారు.
మంచి అడ్మినిస్ర్టేటర్గా పేరున్న బాబు ఇంతలా షాక్కు గురికావడం ఆశ్చర్యకరమే.ఇందుకు అసలు కారకుడు ఆయనేనని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.