ఏపీ కేబినెట్ సమావేశం అమరావతిలో బుధవారం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా రైతులకు మేలు చేసే అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలో అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.ప్రతి రైతు కుటుంబానికి 10 వేలు ఇవ్వాలని ఫిబ్రవరి చివరి వారంలోనే అన్నదాత సుఖీభవ చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.వీరిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే 54 లక్షల మంది రైతులకు కేంద్రం నుంచి మంజూరయ్యే రూ.2 వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.3 వేలు కలిపి రూ.5 వేలు ఇస్తారు.మిగిలిన 16 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వమూ రూ.5 వేలు చెల్లించనుంది.ఇలా రబీలో రూ.5 వేల చొప్పున రెండు సార్లు (మొత్తం రూ.10 వేలు) చెల్లిస్తారు.
ఎన్జీవోలు సచివాలయ ఉద్యోగుల కోసం no 175 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వాలని చదరపు గజం నాలుగు వేలు చొప్పున 200 30 ఎకరాలు కేటాయించాలని జర్నలిస్టులకు యత్రం 10 లక్షలు చొప్పున 30 ఎకరాలు కేటాయించాలని తీర్మానించారు అదేవిధంగా తొలి విడతలో సీఆర్డీయే కు కోటి రూపాయలు చెల్లిస్తే సొసైటీకి భూమి బదలాయింపు ను మిగిలిన మొత్తాన్ని రెండేళ్లలో చెల్లించేలా అవకాశం కల్పించారు మహిళలకు స్మార్ట్ ఫోన్స్ సిమ్ కార్డు తో పాటు మూడేళ్లపాటు యాక్టివేట్ అయ్యేవిధంగా ఉంచాలని ఈ క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు