వ్యక్తికైనా.వ్యవస్థకైనా.లక్ష్యం పెద్దదైనప్పుడు.దానిని సాధించే మార్గం కూడా ఉండాలి.మాటలతో ఎన్నాళ్లు నెట్టుకొస్తారు? ఇప్పుడు ఏపీ బీజేపీ విషయంలో ఇదే కనిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి అధికారంలోకి రావాలనేది పార్టీ ప్రధాన లక్ష్యం.
కానీ.ఆ లక్ష్య సాధన విషయంలో మాత్రం ఇప్పటి వరకు కార్యాచరణ లేకుండా పోయింది.
అంతేకాదు.ఇప్పటికే ఉన్న దూకుడు కూడా తగ్గిపోయింది.
మరి బీజేపీ ఏ విధంగా ముందుకు సాగుతుంది? అనేది ప్రధాన ప్రశ్న.ఇటు రాష్ట్ర పార్టీ చీఫ్.
సోము వీర్రాజు అటు కేంద్రంలోని బీజేపీ పెద్దలు కిషన్రెడ్డి వంటి వారు కూడా బీజేపీ ఏపీలో ఎదుగుతుంది.దీనికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాం.
అనే చెబుతున్నారు.
కానీ, కార్యాచరణ చూస్తే.
మాత్రం దీనికి భిన్నంగా ఉంది.ప్రభుత్వంపై విమర్శలు చేయరు.
పోనీ.విమర్శలు చేయకపోతే పోయారు.
ప్రభుత్వం చేపడుతున్న పనుల విషయంలో అయినా.క్షేత్రస్థాయి లోకి వెళ్లి పర్యవేక్షిస్తున్నారా? లోపాలను ఎత్తి చూపుతున్నారా? సర్కారును నిలదీస్తున్నారా? అంటే అది కూడా లేదు.గతంలో కన్నా లక్ష్మీనారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించేవారు.పనులను పరిశీలించేవారు.ఇసుక అక్రమాల విషయం వెలుగు చూసినప్పుడు క్వారీలకు వెళ్లి.ఏం జరుగుతోందో తెలుసుకుని ప్రజల్లోకి వెల్లడించేవారు.
ఇక, అమరావతి విషయంలో క్లారిటీగా మాట్లాడారు.
దీంతో కన్నాపై ఇటు పార్టీలోను, అటు ప్రజల్లోను కూడా సదభిప్రాయం ఏర్పడింది.
అయితే, ఆయన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన సోము వీర్రాజు మాత్రం.ఈ పరిస్థితి లేకుండా చేశారు.
పార్టీ తరపున అంతో ఇంతో మాట్లాడుతున్న వారిని కూడా కట్టడి చేశారు.ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్నారు.
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలించే తీరిక కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు.దీంతో బీజేపీ వ్యూహం ఏంటో కూడా అర్ధం కావడం లేదు.
మరోవైపు కొన్ని కొన్ని విషయాల్లో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో.ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పెట్రోల్ ధరలను భారీగా పెంచారు.నిత్యావసరాలపై పన్నులు పెంచారు.దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.అదేసమయంలో ఎస్సీ వర్గాలపై దాడులు పెరుగుతున్నాయి.మరోవైపు.అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తూ.
భూకబ్జాలు చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉంటూ.
ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ.బీజేపీ లైట్ తీసుకుంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.
అయినా కూడా నేతలు మాత్రం లక్ష్యం గురించే మాట్లాడుతున్నారు తప్ప.సాధన విషయాన్ని మాత్రం చెప్పడం లేదు.
పట్టించుకోవడమూ లేదు.ఓవరాల్గా ఏపీలో బీజేపీ ఆశ కొండంత ఉంటే.
చేసేది గోరంత ఉంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్లు ఇక్కడ ఎలా ఎదుగుతారో చూడాలి.