ఏపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలపై సీరియస్ అయింది.ఒకపక్క ప్రజలకు ఉచిత పథకాలు అందిస్తూనే మరోపక్క రేట్లు పెంచే దిశగా ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తుంది అన్నట్టు పేర్కొంది.
ముఖ్యంగా నూతన ఆస్తి పన్ను ప్రవేశపెట్టి ప్రజలను అనేక ఇబ్బందులకు పాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలను ఖండిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టడానికి.
ఏపీ బిజెపి ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది.ఏపీ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్.
విష్ణువర్ధన్ రెడ్డి ధర్నాలు గురించి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు పాల్గొన్నలి అని వెల్లడించారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ అదేరీతిలో నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాలు చేపట్టాలని అందరూ తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటిస్తూ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.