ఏపీ ప్రభుత్వం పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.కాగా తన మాటలు ఎవరిని కించ పరిచడానికి చేసినవి కాదంటూనే ఆయన అధికారుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఏంతో కష్టపడి చదవి ఉద్యోగాలు సాధించిన అధికారులు, అధికార పార్టీ నేతల కింద చప్రాసీల్లాగా పని చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారట.అంతే కాకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నలుగురు సామంత రాజులను నియమించి, దోచుకో, దాచుకో అనే విధంగా ప్రవర్తిస్తోందని సృజనా మండిపడ్డారు.
ఇలా అంటూనే సుజనా చౌదరి తన మాటలను సమర్ధించుకున్నారు.ఇదిలా ఉండగా సృజనా చౌదరి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారట.
ఇకపోతే ఏపీ నేతలు ఒకరిని ఒకరు దూషించుకోవడం లో ఎప్పుడు ముందుంటారని ఎన్నో సందర్భాల్లో నిరూపించారు.