ఏపీ రాష్ట్రానికి కీలక ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు ఏపీ బీజేపీ నేతలు.ఈ క్రమంలో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు.
ఈ క్రమంలో అక్కడ ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవటం మాత్రమేకాక పోలవరం నిర్వాసితులకు పరిహారం విషయంలో జాప్యం పై బిజెపి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీకి చెందిన కీలక బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది.
మరోపక్క ఇదే నెల 14వ తారీఖున ఏపీ సీఎం జగన్ ప్రాజెక్టుల పనులను పరిశీలించడానికి రెడీ అయ్యారు.రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు కావడంతోపాటు కరోనా కారణంగా ఇటీవల రాజకీయ నాయకులు తెల్ల కే పరిమితం కావడంతో ప్రస్తుతం బయట వైరస్ ప్రభావం తగ్గటంతో రాష్ట్రానికి సంబంధించి కీలక రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని పర్యటనలు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో కొద్ది రోజుల్లో ఏపీ సీఎం జగన్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించడానికి రాబోతున్న నేపథ్యంలో దానికంటే ముందు ఏపీ బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.