ఏపీ బీజేపీకి కొత్త బాస్... రేసులో ఆ ఇద్దరు

ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలకి దీటుగా ఎదగడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జాతీయ పార్టీ బీజేపీ తన కార్యాచరణకి బలంగా సిద్ధం చేసుకుంది.అందులో భాగంగా టీడీపీ నుంచి, కాంగ్రెస్ పాత కాపులని పార్టీలోకి తీసుకొని సముచిత స్థానం కల్పిస్తుంది.

 Ap Bjp Chief Will Be Plan To Change-TeluguStop.com

ఇక ఏపీలో కాంగ్రెస్ కి ఎలాగూ భవిష్యత్తు లేదని తేలిపోవడంతో ఆ స్థానం బీజేపీ తీసుకోవాలని అనుకుంటుంది.ఇంతకాలం నాయకులు ఉన్న కూడా గ్రామీణ స్థాయిలోకి బలంగా పార్టీని తీసుకెళ్ళే నాయకత్వం లేకపోవడంతో పార్టీ మనుగడ సాగించాలేకపోయిన విషయం గ్రహించిన ఆ పార్టీ అధిష్టానం ఆ దిశగా బలమైన నాయకత్వాన్ని తయారు చేసే పనిలో పడింది.

కేంద్ర నాయకులు ఇప్పటికే ఏపీ మీద ఫోకస్ పెట్టి నిత్యం ఇక్కడికి వస్తూ, అలాగే పార్టీ వాయిస్ ని జనంలోకి బలంగా తీసుకెళ్ళే అధికార ప్రతినిధులని తయారు చేసుకుంది.ప్రస్తుతం ఏపీలో బీజేపీ చీఫ్ గా కన్నా లక్ష్మినారాయణ ఉన్నారు.

అయితే అతనికంటే చరిష్మా ఉన్నా నాయకత్వం కాని, లేదంటే యువ నాయకత్వం కాని ఉంటే పార్టీని వేగంగా ప్రజలలోకి తీసుకెళ్ల వచ్చని భావించిన అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తుంది.అందులో భాగంగా ఏపీ బీజేపీ కొత్త బాస్ గా ఇద్దరి పేర్లుని ప్రముఖంగా పరిశీలిస్తుంది.

అందులో కేంద్ర మాజీ మంత్రి ఎన్టీఆర్ కుమార్తె గా కొంత చరిస్మా ఉన్న పురందరేశ్వరి, అలాగే యంగ్ లీడర్ గా ఉన్న విశాఖపట్నంకి చెందిన ఎమ్మెల్సీ మాధవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.మరి వీరిలో ఎవరిని పార్టీ అధిష్టానం ఫైనల్ చేస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube