కరోనా వల్ల ఎప్పుడు ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుందో ఊహించడం కష్టంగా మారింది.ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగసంస్దల పని వేళల్లో కీలక మార్పులు కూడా జరిగాయి.
మొదటి సారి వచ్చిన కరోనా వల్లనే ఇంకా ప్రజలు కోలుకోలేదు.ఇక ప్రస్తుతం వచ్చిన కోవిడ్ సెకండ్ వేవ్ అయితే బ్రతుకు మీద ఆశలే వదిలేయని హెచ్చరిస్తున్నటుగా ప్రవర్తిస్తుంది.
ఇక ఇప్పటికే ఈ కోవిడ్ వల్ల బ్యాంకు పనివేళలు కుదించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా మరోసారి కూడా ఏపీ బ్యాంకుల పని వేళ్లలో మార్పులు చేశారు.
కాగా ఈ రోజు నుండే ఈ మార్పులు అమలు చేస్తున్నట్లుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) నిర్ణయం తీసుకుంది.ఇకపోతే రాష్ట్రంలోని బ్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసినా లావాదేవీలకు మాత్రం మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతించాలని ఎస్ఎల్బీసీ ఆదేశాలిచ్చింది.
అత్యవసరమైతేనే ఖాతాదారులు బ్యాంకులకు రావాలని సూచించింది.