ఆం్రధ్రపదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అమరావతిలోనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.సోమవరాం ఆయన వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
సచివాలయ ఉద్యోగులంతా కలిసి రావడం ఆనందంగా ఉందని, మంచి మనసులో ఇక్కడకి వచి్చన ఉద్యోగులు చిన్న సమస్యలను పక్కన పెట్టి ్రపభుత్వానికి సహకరించాలని కోరారు.అక్టోబర్ నాటికి నిర్మాణాలు పూర్తి స్దాయిలో అందుబాటులోనికి వస్తాయని, ్రపజా ్రపతినిధులంతా అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.
కొత్త రాజధానిలో ఐటీ కంపెనీల మాదిరిగానే ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించామని , పేర్కొన్నారు.ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉద్యోగుల తరలింపు ఉంటుందని ఆమేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
స్వంత గడ్డ నుంచి పాలన ్రపారంభం కావాలన్న కాంక్ష తీరనున్నట్టు చంద్రబాబు వ్యాఖ్యానించారు.
.