ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాల పై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో పేదలకు పెన్నిధిగా మారాయని తమ్మినేని సీతారాం అన్నారు.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లో పలు మండలాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.“జగనన్న పచ్చతోరణం” లో భాగంగా మొక్కలు నాటి.రాష్ట్రంలో పేదలకు జగన్ ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు.
ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు జీవితాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ తో పాటు ప్రభుత్వ అధికారులు అదే రైతుల వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కూడా పాల్గొన్నారు.