1.కిషన్ రెడ్డి పాదయాత్ర
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు.
2.కేసీఆర్ సమీక్ష
నిజామాబాద్ జిల్లా అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలు , పెండింగ్ పనులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
3.బండి సంజయ్ పాదయాత్ర
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రేపటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టనున్నారు.
4.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉన్నారు.
5.షర్మిల పాదయాత్ర
వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 222 వ రోజుకి చేరుకుంది.
6. జగన్ కు లేఖ రాసిన టిడిపి ఎమ్మెల్యే
మత్స్యకారుల ఇబ్బందులను వివరిస్తూ ఏపీ సీఎం జగన్ టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేక రాశారు.
7.తెలంగాణ గురించి మాట్లాడిన ప్రధాని
ఈరోజు జరిగిన మాన్ కి బాత్ కార్యక్రమంలో తెలంగాణ గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు.ఈ సందర్భంగా సిరిసిల్ల చేనేత కార్మికుడు హరిప్రసాద్ ప్రశంసలు కురిపించారు.
8.సంకల్ప సిద్ది వ్యవహారంలో కొనసాగుతున్న విచారణ
సంకల్ప సిద్ధి వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది.సంకల్ప సిద్ది మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలోని ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు.
9.పరారీలో వెల్ విజన్ చైర్మన్
పెట్టుబడుల పేరుతో కోట్లు వసూలు చేసిన వెల్ విజన్ చైర్మన్ కందుల శ్రీనివాస్ పరారీలో ఉన్నారు.
10.అచ్చెన్న నాయుడు కామెంట్స్
సైకో సీఎం జగన్ రెడ్డి పాలనలో సైకోలు స్వైర విహారం చేస్తున్నారని, టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు కామెంట్స్ చేశారు.
11.లోకేష్ కామెంట్స్
పెద్ద సైకో పాలనలో ఊరికో సైకో స్వైర విహారం చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
12.ధ్రువ స్పేస్ టెక్ కు సీఎం కేసీఆర్ కితాబు
పీఎస్ ఎల్వి సీ 54 తో రెండు నానో ఉప గ్రహాలు అంకుర సంస్థలకు సుదినమని కేసీఆర్ కితాబిచ్చారు.
13.ఎంబీ బీఎస్ కన్వీనర్ కోటా సీట్లు
ఎంబిబిఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్ లు నిర్వహించ నున్నట్టు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం తెలిపింది.
14.గవర్నర్ లు రాజ్యాంగ సాంప్రదాయాలు పాటించాలి
గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందికర పరిస్తితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి తెలిపారు.
15.గవర్నర్ అంటే గౌరవం లేదు
రాజ్యాంగ బంధమైన గవర్నర్ పదవి అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అన్నారు.
16.హై కోర్ట్ లో రాజ్యాంగ దినోత్సవం
భారత రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ రూప కల్పన సభ్యులు చేసిన కృషి మరువలేనిది అని జస్టిస్ యు దుర్గాప్రసాద్ పేర్కొన్నారు .రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైకోర్టులో అంబేద్కర్ చిత్రపటానికి అర్పించారు.
17.రుషికొండ పై వాస్తవాలు వెల్లడించాలి: సీపీఎం
విశాఖ పట్నం లోని రుషికొండ తవ్వకాలపై వాస్తవాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
18.పవన్ కామెంట్స్
అంబేడ్కర్, గాంధీల కంటే వైఎస్సార్ గొప్పవాడు ఏమీ కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
19.అటవీ సిబ్బందికి ఆయుధాలు
క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇచ్చేందుకు తెలంగాణ వ్యాప్తంగా 30 ఫారెస్ట్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియెల్ తెలిపారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,560
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -52,980
.