1.బండి సంజయ్ కు భద్రత పెంపు
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసుల భద్రత పెంచారు బండి సంజయ్ కు 1+5 తో రోప్ పార్టీ ఏర్పాటు చేశారు.
2.గోల్కొండ బోనాల ఏర్పాటుపై మంత్రి తలసాని సమీక్ష
ఈనెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే గోల్కొండ బోనాలు ఏర్పాటుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
3.యోగా దినోత్సవం
తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ కీలక నాయకులు పాల్గొన్నారు.
4.ఎమ్మెల్యే రాజాసింగ్ కు కోవిడ్
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
5.ఎస్ ఎల్ జి ఆస్పత్రికి 24 కోట్ల జరిమానా
బాచుపల్లిలోని ఎస్ ఎల్ జి ఆసుపత్రి యాజమాన్యానికి నిజాంపేట మున్సిపల్ అధికారులు 24 కోట్లు జరిమానా విధించారు.
6.షర్మిల విమర్శలు
కామన్ హౌస్ పరిమితమై రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోని కెసిఆర్ పాలన అవసరమా అంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
7.జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పై ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆయన పాదయాత్ర చేపడితే ప్రజల్లో చైతన్యం వస్తుందని బీజేపీ నాయకత్వానికి భయం పట్టుకుందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
8.రేపు రాజీవ్ స్వగృహ ప్లాట్ల లాటరీ
రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ ఫ్లాట్ ల లాటరీ బుధవారం జరగనుంది ఈ మేరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, గృహ నిర్మాణ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
9.బాలల రక్షణ కమిటీలు
తెలంగాణ వ్యాప్తంగా చిన్నారుల రక్షణకు బాలల రక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
10.అందులు బదిరుల ఆశ్రమ పాఠశాలలు కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అందులో భద్ర ఆశ్రమ పాఠశాలలు జూనియర్ కాలేజీలో ప్రవేశాలకు దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
11.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 246 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12.‘ దిశ ‘ ఎన్ కౌంటర్ పై హైకోర్టు విచారణ
దిశ అత్యాచారం హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన వ్యవహారం పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
13.చర్ల లో ప్రొక్లెయిన్ తగులబెట్టిన మావోయిస్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అడవుల్లో ట్రెంచ్ పనులు చేస్తున్న అటవీ శాఖకు చెందిన ప్రొక్లేయినర్ ను మావోయిస్టులు తగులబెట్టారు.
14. వైసీపీ ఎంపీలు , మంత్రులపై సోము వీర్రాజు సంచలన కామెంట్స్
ఏపీలో రోడ్ల పరిస్థితి పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ మంత్రులు , ఎంపీలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.వైసిపి ఎంపీలు, మంత్రులు మగాళ్లు అయితే మా ముందుకు రండి అంటూ వీర్రాజు ఛాలెంజ్ చేశారు.
15.గన్నవరం ఎయిర్ పోర్ట్ రన్ వే నిర్వాసితుల ఆందోళన
గన్నవరం ఎయిర్ పోర్ట్ రన్ వే నిర్వాసితులు ఆందోళనకు దిగారు.తమకు నష్టపరిహారం చెల్లించాలని 400 మందికి పైగా బాధితులు డిమాండ్ చేశారు.
16.ఆమంచి కృష్ణమోహన్ కు సిబిఐ నోటీసులు
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మరోసారి నోటీసులు జారీ చేసింది.
17.శ్రీకాకుళం ఎలుగుబంటి దాడిలో ఒకరి మృతి
శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడి శింగిలో రెండు రోజులుగా ఎలుగుబంటి హల్ చల్ చేస్తోంది.తాజాగా ఎలుగుబంటి దాడిలో ఒకరి మృతి చెందారు.
18. త్వరలో కొత్త పెన్షన్ లు, రేషన్ కార్డులు
త్వరలో కొత్త రేషన్ కార్డులతో పాటు పెన్షన్ లను జారీ చేయబోతున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు.
19.యోగా దినోత్సవం లో పాల్గొన్న ప్రధాని
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూర్ లో యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోది పాల్గొన్నారు.
20.నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
ఆత్మకూరు ఉప ఎన్నికకు నేటితో ప్రచారం ముగియనుంది.