న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు

తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడికి నిరసనగా ఈ పిలుపునిచ్చారు. 

2.విశాఖలో జగన్ పర్యటన

  వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. 

3.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై హైకోర్టు విచారణ

 

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. 

4.బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం

  నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 

5.మూడో టీ 20 మ్యాచ్

 

నేడు ఆస్ట్రేలియాతో భారత మహిళల మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. 

6.జాతీయ ఇంధన పరిరక్షణ ర్యాలీ ప్రారంభం

  విజయవాడ లో జాతీయ ఇంధన పరిరక్షణ ర్యాలీ ప్రారంభం కానుంది. 

7.కాంగ్రెస్ వార్ రూమ్ సీజ్ పై పార్లమెంట్ లో వాయిదా తీర్మానం

 

Advertisement

కాంగ్రెస్ వార్ రూమ్ ను తెలంగాణ పోలీసులు సీజ్ చేయడంపై ఏఐ సీసీ సీరియస్ అయ్యింది.ఈ క్రమంలోనే పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు. 

8.చెన్నై మారథాన్

  జనవరి 8 న చెన్నై నగరంలో మారథాన్ -2023 లో నిర్వహించనున్నారు. 

9.తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల గృహ నిర్భంధం

 

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 

10.బీఆర్ఎస్ పై విజయశాంతి కామెంట్స్

  బీ ఆర్ ఎస్ పార్టీ పై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.కేసీఆర్ దత్తత తీసుకున్న ఊరిని ఉద్ధరించే దిక్కులేదు గాని , భారతదేశాన్ని నడిపిస్తానంటూ బీఆర్ఎస్ పేరిట బీరాలు పలకడం విడ్డూరం గా ఉందని విజయశాంతి మండిపడ్డారు. 

11.నంది పైపుల ఎండీ పై కేసు నమోదు

  నంద్యాల కు చెందిన నంది పైపుల ఎండీ సుజల పై పోలీసులు కేసు నమోదు చేశారు.తనను నిర్బంధించి దాడి చేశారని వాచ్ మెన్ జమాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. 

12.చిరంజీవి పై పావలా శ్యామల కామెంట్స్

 

మెగాస్టార్ చిరంజీవి తోటి నటీ నటులను గౌరవంగా చూసుకుంటారని , అందరినీ అభిమనిస్తూ ఉంటారని ప్రముఖ నటి పావలా శ్యామల అన్నారు. 

13.మంత్రిగా ఉదయనిధి ప్రమాణం

 

తమిళనాడు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మంత్రివర్గంలో కి తీసుకున్నారు. 

14.రాహుల్ జోడో యాత్రలో రాహుల్

  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలతో పాటు ,మాజీ ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ పాల్గొన్నారు. 

15.చంద్రబాబు నివాసం వద్ద సెక్యూరిటీ ఆడిట్

 

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

టిడిపి అధినేత చంద్రబాబు నివాసం వద్ద సెక్యూరిటీ నిర్వహించారు. 

16.ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరిక

  ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు హెచ్చరిక జారీ చేశారు.సంక్రాంతి లోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. 

17.ప్రభాస్ పై విశాల్ కామెంట్స్

 

Advertisement

ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని, తమిళ సినీ హీరో విశాల్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

18.ఇక పై ఫించన్ రూ.2750

  ఏపీలో ఇకపై వృద్ధాప్య పెన్షన్ ను 2750 ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

19.పవన్ పై రోజా కామెంట్స్

 

నారాహి ముసుగులో పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో వచ్చినా,  ఎవరు భయపడేది లేదని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజ అన్నారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -50,300   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 54,880.

తాజా వార్తలు