1.కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు.గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ లేఖలో కోరారు.
2.కృష్ణంరాజు మృతి పై పలువురు సంతాపం
ప్రముఖ నటుడు రెబల్ స్టార్ మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందడంతో ఆయనకు , సినీ రాజకీయ వర్గాలు కృష్ణంరాజు భౌతిక గాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.
3.జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( జే ఈ ఈ ) అడ్వాన్సడ్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి.
4.బంగాళాఖాతంలో అల్పపీడనం తెలంగాణకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో సోమవారం కూడా తెలంగాణలో ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
5.సింగరేణి ఓసీలలో చేరిన వరద నీరు
గదరు కొద్దిరోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కారణంగా మణుగూరు ఏరియా సింగరేణి ఓసీలలో వరదనీరు చేరింది .దీంతో సుమారు 40 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
6.కృష్ణంరాజు మృతి పై కేసీఆర్ దిగ్భ్రాంతి
ప్రముఖ చలనచిత్రం నటుడు కృష్ణంరాజు మృతి పై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
7.సింగరేణి రాత పరీక్ష ఫలితాలు విడుదల
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
8.కోవిడ్ టీకాలపై పరిశోధనలు జరగాలి
కోవిడ్ 19 రూపొందించిన ఫైజర్ , మెడార్నా, ఆస్ట్రాజెనకా, జాన్సన్, సినో వాక్, స్పుత్నిక్ వి లకు సంబంధించిన ప్రభావాలపై మరిన్ని పరిశోధనలు జరగాలని 34 దేశాలకు చెందిన వైద్యులు తాజాగా అభిప్రాయపడ్డారు.
9.సంజయ్ నాలుగో విడత యాత్ర
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది.
10.కెసిఆర్ కు సీఐటీయూ లేఖ
వీఆర్ ఏల డిమాండ్ల ను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు సీఐ టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ లేఖ రాశారు
11.మోడ్రన్ ఫిష్ మార్కెట్ ప్రారంభం
బేగంబజార్ లో 9.50 కోట్లతో ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ భవనాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
12.ఏడాది పాటు హైదరాబాద్ విమోచన దినోత్సవం
ఏడాది పాటు హైదరాబాద్ విమోచన దినోత్సవం ను భారత ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
13.సమైక్య వజ్రోత్సవాలు జయప్రదం చేయాలి
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సమైక్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు.
14. రవీందర్ సింగ్ పై కెసిఆర్, కేటీఆర్ కు ఫిర్యాదు
జాతీయ రాజకీయాల్లో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు ఇవ్వనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని కరీంనగర్ కార్పొరేషన్ లోని టీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్లు అందరూ తీర్మానం చేసి కెసిఆర్ , కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు.
15.విమోచన అమృత మహోత్సవాలకు బిజెపి విస్తృత ఏర్పాట్లు
విమోచన అమృత మహోత్సవాలకు బిజెపి విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది.8,000 మంది విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను పెరేడ్ గ్రౌండ్స్ కు తరలించాలనే ఆలోచనలో బిజెపి ఉంది. మొత్తం 30 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
16.ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అరెస్ట్
టిడిపి నేతలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు కంకిపాడు టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాహనాన్ని పోలీసులు అడ్డుకొని ఆయనను ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
17.కేసీఆర్ కుమార స్వామి భేటీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రగతిభవన్ కు వచ్చారు.ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ తో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు.
18.అధికారిక లాంచనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు
అధికారిక లాంచనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
19.విభూది తో చేసిన వినాయకుడి నిమజ్ఞం
నేడు రాజమండ్రి పుష్కర్ ఘాట్ లోని విభూది వినాయకుడి నిమఙ్ఞం జరగనుంది.3 టన్నుల విబుదితో వినాయకుడి విగ్రహం తయారు చేశారు.
20.విశాఖలో వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ ప్రారంభం
విశాఖలో వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్ ను మంత్రి విడదల రజనీ ప్రారంభించారు.
.