న్యూస్ రౌండప్ టాప్ 20

1.రాహుల్ సోనియాకు ఈడీ సమన్లు

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశా  

2.

ఈటల రాజేందర్ విమర్శలు

  కేంద్రంలో చక్రం తిప్పుతానని వెళ్లిన ముఖ్యమంత్రి బొక్క బోర్లా పడ్డ అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. 

3.మినీ ప్యాక్ లలో విజయ ఉత్పత్తులు

 

 వినియోగదారులకు సౌకర్యంగా ఉండేందుకు మినీ ప్యాక్ లలో విజయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు రా పో తున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

4.ఈ నెల 3 నుంచి గ్రేటర్ లో పట్టణ ప్రగతి

  గ్రేటర్ లో ఈ నెల మూడో తేదీ నుంచి పదిహేను రోజులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

5.నేటి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్

 

నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శిబిర్ ప్రారంభంకానుంది దీనికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తారు. 

6.తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనున్న కేంద్రం

  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని  కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించనుంది.కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో వేడుకలు నిర్వహించనున్నారు. 

7.కార్మిక ధర్మ యుద్ధం సభలో ఎనిమిది తీర్మానాలు

  కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నెలంతా కార్మిక మాసోత్సవాలు నిర్వహించామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.కార్మిక ధర్మయుద్ధం సభలో 8 తీర్మానాలు చేశారని వాటిపై పోరాడుతామన్నారు. 

8.బస్సు యాత్ర కాదు బుస్సు యాత్ర

 

Advertisement

ఏపీ మంత్రులు చేపట్టింది బస్సు యాత్ర కాదు అని, బుస్సు యాత్ర అని టిడిపి మాజీ మంత్రి పితల సుజాత విమర్శించారు. 

9.లోకేష్ విమర్సలు

  వైసిపి అరాచకాలకు వెల్దుర్తి ఘటన పరా కాస్ట అని టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. 

10.జిల్లా కోర్టులో వివేకా హత్య కేసు నిందితుడి పిటిషన్

 

జిల్లా జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలి అంటూ మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి బుధవారం కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

11.ఆత్మకూరు లో మేము పోటీ చేస్తున్నాం సోము వీర్రాజు

  ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి తరఫున అభ్యర్థిని నిలబెడితే ఉన్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 

12.రిషి కొండలు నిర్మాణాలకు సుప్రీంకోర్టు అనుమతి

  విశాఖపట్టణంలోని ఋషికొండ లో టూరిజం భవనాల నిర్మాణంపై ఎన్ జి టి విధించిన స్టే ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.రిషి కొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

13.కేంద్రంపై హరీష్ రావు కామెంట్స్

 

తెలంగాణ అభివృద్ధి చూడలేకే కేంద్రం ఇబ్బందులు పెడుతోందని హరీష్ రావు విమర్శించారు. 

14.ఉత్తంకుమార్ రెడ్డి కామెంట్స్

  నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య అని ఉత్తంకుమార్ రెడ్డి కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

15.సివిల్స్ విజేతలకు విందు

  హైదరాబాద్ లోని తన నివాసంలో ఫలితాల్లో ర్యాంకులు సాధించిన అభివృద్ధి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అల్పాహార విందు ఇచ్చారు. 

16.సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం అరెస్ట్

 

హన్మకొండ వరంగల్ జిల్లాలో జరుగుతున్న భూ పోరాటాల కేంద్రాలను సందర్శించేందుకు వెళుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

17.గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పెంపు

  గ్రూప్ 1 కు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు టిఎస్పిఎస్సి గుడ్ న్యూస్ చెప్పింది .జూన్ 4వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు ప్రకటించింది. 

18.సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం

  ఈరోజు నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధించారు . 

19.శ్రీకాకుళం జిల్లా లో పర్యటించనున్న నాగబాబు

 

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

శ్రీకాకుళం జిల్లాలో జనసేన నేత కొణిదల నాగబాబు పర్యటిస్తున్నారు. 

20.అన్నవరం దేవస్థానం ఉద్యోగులకు డ్రెస్ కోడ్

  నేటి నుంచి అన్నవరం దేవస్థానం ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించారు నేటినుంచి డ్రెస్ కోడ్ పాటించకపోతే 500 జరిమానా విధించనున్నారు.

Advertisement

తాజా వార్తలు