1.ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో క్రికెటర్ కళ్యాణ్
ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో వికారాబాద్ జిల్లా తాండూరు కు చెందిన క్రికెటర్ కళ్యాణ్ పవార్ స్థానం సంపాదించాడు.
2.తెలంగాణ హైకోర్టు కు ఏపీ రైతులు
కృష్ణ జలాల విషయం తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘనలపై రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
3.కళాశాలలో క్లస్టర్ విధానం పై కమిటీ
కళాశాలలో క్లస్టర్ విధానంపై క్రెడిట్ ట్రాన్స్ఫరింగ్ , రిసోర్స్ షేరింగ్ వల్ల వచ్చే ఇబ్బందులపై అధ్యయనం కోసం ఉన్నత విద్యా మండలి ఓ కమిటీని నియమించింది.
4.జల వివాదం పై కేంద్రానికి బండి సంజయ్ లేఖ
కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు.
5.ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై తేనెటీగల దాడి
ఇల్లంతకుంట మండలం అనంతగిరి పంప్ హౌస్ దగ్గర ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై తేనె టిగలు దాడి చేశాయి.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.
6.కోవాగ్జిన్ మూడో దశ ఫలితాలు విడుదల
దేశంలోని 25 ఆసుపత్రుల్లో 25,798 మంది పై నిర్వహించిన కోవూరు మూడో దశ ప్రయోగ పరీక్షల ఫలితాలను భారత్ బయోటెక్ ప్రకటించింది.
7.మాణిక్యం ఠాకూర్ తో భట్టి విక్రమార్క భేటీ
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ తో భేటీ అయ్యారు.
8.రాష్ట్రవ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
9.ట్విట్టర్ ఇండియా పై మరో కేసు
తాజాగా ట్విట్టర్ ఇండియా పై మరో కేసు నమోదైంది.ట్విట్టర్ ఎండి మనీష్ మహేశ్వరి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోలీసులకు ఆదిత్యా సింగ్ అనే న్యాయవాది ట్విట్టర్ పై ఫిర్యాదు చేశారు.
10.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 43,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర దర్యాప్తు
దర్భంగా రైల్వే స్టేషన్ లో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న ఆధారాలు లభించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ ఐ ఏ ) ఉగ్ర కోణం మూలాలను అన్వేషించేందుకు నిర్ణయించింది.ఈమేరకు హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనను కొనసాగించనున్నారు.
12.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా 2,930 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.‘ గ్రేట్ శంకర్ ‘ గా మమ్ముట్టి
మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ మాస్టర్ పీస్ ‘ .అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలైన విజయం సాధించింది.ఇప్పుడు ఆ సినిమాను గ్రేట్ శంకర్ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు.
14.రకూల్ కోసం కొవి సెల్ఫ్ కిట్ పంపిన స్టార్ హీరో
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కోవీ సెల్ఫ్ కిట్ పంపించారు.ఈ విషయాన్ని ఇన్స్టి గ్రామ్ ద్వారా రకుల్ షేర్ చేసుకుంది.
15.”అల అమెరికాపురం లో ” ప్రోమో లాంచ్ చేయనున్న బన్నీ
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అమెరికా ప్రధాన నగరాల్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.థమన్ యూఎస్ఏ లో తన లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.ఈ లైవ్ కాన్సర్ట్ కు ఆసక్తికరంగా ” అల అమెరికా పురములో ” అనే పేరు పెట్టారు.ఈ ప్రోమోను ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు అల్లు అర్జున్ ఆవిష్కరించనున్నారు.
16.శ్రీశైలంలో అర్ధరాత్రి డ్రోన్ ల కలకలం
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం లో అర్ధరాత్రి డ్రోన్లు కలకలం సృష్టించాయి.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో ఆకాశంలో అనుమానాస్పదంగా డ్రోన్ కెమెరాలు చక్కెర్లు కొట్టాయి వీటిని పట్టుకునేందుకు పోలీసులు ఆలయ సిబ్బంది ప్రయత్నించినా అవి చిక్కలేదు.
17.కొత్త ప్రాజెక్టును ఒకే చేసిన నాగ చైతన్య
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కొత్త మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తోంది.నేను శైలజ, చిత్రలహరి, రెడ్ మూవీలకు దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు.
18.కేసిఆర్ అంటే జగన్ కు అభిమానం
కెసిఆర్ అంటే జగన్ కు అభిమానం ఉంది అంటూ ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
19.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.శనివారం శ్రీవారిని 18,572 మంది భక్తులు దర్శించుకున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,310 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,310.