1.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ కొత్తగా 4,446 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.ఆగస్టు 24 ,25 న ఎడ్ సెట్
రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 19 నుంచి జూన్ 15 వరకు కొనసాగుతుంది.
3.
మే 31 దాకా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు
పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది.మార్చి 31తో ముగిసిన ఈ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు .
4.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.10 12 తరగతుల పరీక్షలు వాయిదా
కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐ ఎస్సీ ఈ ) 12వ తరగతి (ఐ ఎస్సీ) , పదవ తరగతి ( ఐసీఎస్ ఈ ) పరీక్షలను వాయిదా వేసింది.
6.మూడో రోజు వైయస్ షర్మిల దీక్ష
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటూ వైయస్ షర్మిల చేపట్టిన నిరసన దీక్ష మూడో రోజుకు చేరుకుంది.
7.ఎంటర్ స్క్రీనింగ్ పరీక్ష వాయిదా
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ప్రతిభ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ స్క్రీనింగ్ పరీక్ష వాయిదా పడింది.కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండడం తోనే వీటిని వాయిదా వేశారు.
8.లాలూ ప్రసాద్ యాదవ్ కి బెయిల్
దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది.
9.ప్రధాని మోదీక మహారాష్ట్ర సీఎం ఫోన్
మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఫోన్ చేశారు.
ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపధ్యంలో తగిన సహాయం అందించాలని ఆయన కోరారు.
10.ఇక నుంచి రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధర 50
బెంగళూరు డివిజన్లోని పలు రైల్వే స్టేషన్లు సాధారణ రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు దీంతో వీరిని నియంత్రించే దశలో భాగంగా ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలను ఈనెల 17 నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం 10 రూపాయలు ఉన్న ధరను 50 రూపాయలకు పెంచారు.
11.కుంభమేళా పై మోదీ ట్వీట్
ఉత్తరాఖండ్ హరిద్వార్ లో జరుగుతున్న మహా కుంభమేళా విషయం పై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
కుంభమేళా వేడుకలను ఇక ఒక సంకేతంగా మాత్రమే చూడాలి అని వ్యాఖ్యానించారు.
12.వైమానిక దళానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
భారత వైమానిక దళానికి తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మొదటి విడత సరఫరా పూర్తి చేశామని అశోక్ లేలాండ్ తెలిపింది.
13.నకిలీ ఓటర్ల పై కఠిన చర్యలు : సీఈవో
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు.
14.తిరుపతిలో దొంగఓట్ల కలకలం
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది వైసిపి దొంగ ఓట్లు వేసేందుకు వేల మందిని తిరుపతికి తరలించారని టీడీపీ ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
15.ఏపీ సచివాలయం లో కరోనా టెన్షన్
ఏపీ సచివాలయం ల ఓ ఉద్యోగి కరోనా తో మృతి చెందారు.ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేసేవి పద్మారావు కరోనా కారణంగా మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
16.దీప్ సిద్ధూ కు బెయిల్ మంజూరు
కంట త్ర దినోత్సవం రోజు ఢిల్లీ లో ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో నిందితుడిగా ఉన్న దీప్ సిద్ధూ కి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది.
17.హాస్య నటుడు వివేక్ మృతి
తమిళ సినిమాలో టాప్ కమెడియన్ గా ఉన్న వివేక్ గుండెపోటు తో ఆకస్మికంగా మృతి చెందారు.
18.పవన్ త్వరగా కోలుకోవాలి : మహేష్
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరుణ ప్రభావంకు గురికావడంతో చిత్రసీమకు చెందిన పలువురు పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు పవన్ త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా కోరారు.
19.సోనూసూధ్ కి కరోనా పాజిటివ్
రియల్ హీరో, ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనుసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,000
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,000.