1.యాదాద్రి లో ఆర్జిత సేవలు రద్దు
యాదాద్రి లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి.దీంతో స్వామి వారి ఆర్జిత సేవలు రద్దు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
2.టీఆర్ఎస్ లోకి బీజేపీ నేత
నాగార్జున సాగర్ లో టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత కటారి అంజయ్య టీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
3.మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి ఆచూకీ లభ్యం
గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లాలో కలకలం సృష్టిస్తున్న పెద్ద పులి ఆచూకీ ఎట్టకేలకు లభించింది.ఈ మేర పులి అడుగులు ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
4.ఏ క్షణమైనా ఏపీ రాజధాని తరలింపు
విశాఖ కి ఏ క్షణమైనా పరిపాలనా రాజధాని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
5.మాజీ మంత్రి జవహర్ కు కరోనా పాజిటివ్టీ
డీపీ మాజీ మంత్రి జవహర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
6.తిరుపతి అభివృద్ధి పై చర్చకు సిద్ధం
తిరుపతి అభివృద్ధి పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో చర్చకు సిద్ధం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
7.నామినేషన్ లు దాఖలు చేసిన భగత్, జానారెడ్డి
నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి గా భగత్, కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
8.విశాఖ ఉక్కు పై హై కోర్టు లో పిటిషన్వి
శాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటికరణ కు వ్యతిరేకంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
9.టిడిపి ఎంపి కి కేంద్రమంత్రి లేఖ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాసిన లేఖపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఠాకూర్ లేఖ రాశారు.ఉక్కు ప్రైవేటీకరణ తో అందరికీ మంచే జరుగుతుంది అని ఆ లేఖలో మంత్రి పేర్కొన్నారు.
10.విశాఖ ఉక్కు ఆందోళనలు
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళన నిర్వహించారు.
11.‘ టాస్ ‘ గడువు పెంపు
పదో తరగతి , ఇంటర్ ప్రవేశ పరీక్ష ల గడువును ఈ నెల 31 వరకు పొడగించినట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ( టాస్) డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
12.మెట్రో అధికారులు ప్రకటన
.మెట్రో రైళ్ళలో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి అని మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు.
13.ఇంటింటా కరోనా పరీక్షలు వాయిదా
చెన్నై కార్పొరేషన్ పరిధిలో ఇంటింటా చేపట్టదలచిన కరోనా పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
14.పార్క్ లో ఉరి వేసుకున్న బిజెపి నేత
ఢిల్లీలో బిజెపి నాయకుడు జి ఎస్ బవ పార్క్ లో ఆత్మహత్య చేసుకున్నారు.వ్యక్తిగత సమస్యలే దీని కారణంగా తెలుస్తోంది.
15.ఫరూక్ అబ్దుల్లా కు కరోనా పాజిటివ్నే
షనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కరోనా ప్రభావాని కి గురయ్యారు.
16.హోటల్ తాజ్ లో కరోనా కలకలం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుషికేశ్ లో ఉన్న తాజ్ హోటల్ లో కరోనా కలకలం సృష్టించింది.హోటల్ లో మొత్తం 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో హోటల్ ను మూసివేశారు.
17.అమెరికా లో కాల్పుల కలకలం
అమెరికాలోని మేరీల్యాండ్ జోషువా గ్రీన్ (27) అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతని తల్లిదండ్రులతో పాటు మరో నలుగురు మృతి చెందారు.
18.ఏపీ ప్రభుత్వం పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది.నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
19.కృష్ణాజిల్లాలో యాభై వేలు దాటిన కరోనా కేసులు
కృష్ణాజిల్లాలో కరుణ పాజిటివ్ కేసులు తీవ్రత పెరుగుతోంది.ఇప్పటికి సుమారు 50 వేల యాక్టీవ్ కేసులు ఈ జిల్లాలో నమోదయ్యాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 43,620
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,620.