1.వీహెచ్ కు రేవంత్ పరామర్శ
అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ను ఎంపీ రేవంత్ రెడ్డి పరామర్శించారు.
2.నేడు ఇంటర్ ద్వితీయ ఫలితాలు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు విడుదల చేయనున్నారు.
3.అడ్డ గూడూరు కస్టడీయల్ డెత్ పై హైకోర్టులో విచారణ
అడ్డగూడూరు కస్టోడియల్ డెత్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది.
4.ఫ్లై ఓవర్ కు పీజేఆర్ పేరు పెట్టాలి
బాలానగర్ ఫ్లై ఓవర్ కి మాజీ సీఎల్పీ నేత దివంగత జనార్దన్ రెడ్డి పేరు పెట్టాలని ఏఐసీసీ సభ్యులు టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.
5.ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు
Upakari.com ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్ లైన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి కుటుంబరావు తెలిపారు.ఆసక్తి ఉన్నవారు 8309910673 నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.
6.నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం
హైదరాబాద్ నగరం లోని సనత్ నగర్ లోని పొట్టి శ్రీరాములు నగర్ లో నిర్మించిన 162 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సోమవారం ప్రారంభించనున్నారు.
7.కోవిడ్, వ్యాక్సినేషన్ ల పై సీఎం జగన్ సమీక్ష
పొట్టి శ్రీరాములు నగర్ లో నిర్మించిన 162 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈ రోజు ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ , ప్రశాంత్ రెడ్డి, మేయర్ తదితరులు పాల్గొననున్నారు.
8.కోవిడ్ వ్యాక్సినేషన్ లపై జగన్ సమీక్ష
కోవిడ్, వ్యాక్సినేషన్ ల పై సీఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు.
9.బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది.రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశం లో పాల్గొనగా, జూమ్ ద్వారా ఏపీ ఇన్చార్జి మురళీధరన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
10.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 46,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
11.నేతాజీ టోపీ సురక్షితం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ టోపీ సురక్షితంగా ఉందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.
12.వెంటిలేటర్ పైనే కత్తి మహేష్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీనటుడు, విమర్శకుడ కత్తి మహేష్ చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
13.సీవీయెల్ కు రాములమ్మ సపోర్ట్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీవీయెల్ నరసింహ రావు కు విజయశాంతి మద్దతు పలికారు.
14.మంచు విష్ణు అధికారిక ప్రకటన
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కి తాను నామినేషన్ వేస్తున్నట్లు యంగ్ హీరో మంచు విష్ణు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
15.జర్నలిస్టుల సమస్యలపై రఘురామ లేఖ
ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు రెండేళ్లుగా అక్రిడేషన్ కార్డులు జారీ చేయడం లేదని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
16.మహిళా కూలీకి వజ్రం లభ్యం
టమాటా నారు నాటుతున్న కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ కూలికి ఆదివారం వజ్రం లభించింది.అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి ఆరు లక్షలకు దాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం.
17.టీడీపీ నేతల మధ్య విభేదాలు : ఫ్లెక్సీల కు నిప్పు
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి.మాజీ ఎమ్మెల్యే హనుమంత్రాయ చౌదరి టిడిపి ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు మధ్య విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి.
తాజాగా ఉమామహేశ్వర నాయుడు కు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రత్యర్థులు నిప్పు పెట్టారు.ఈ వ్యవహారం పై పెద్ద దుమారమే రేగుతోంది.
18.ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో డైనోసార్ల చరిత్ర
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతి నగర్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో డైనోసార్ల ఆనవాళ్లను గుర్తించారు.
19.శ్రీకాళహస్తి అన్న ప్రసాదానికి ఐఎస్ఓ సర్టిఫికేట్
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అన్న ప్రసాదం నాణ్యత, శుభ్రతకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్ వో సర్టిఫికెట్ లభించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,170 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,170
.