1.మొబైల్ ఫిష్ వెహికల్స్
నెక్లెస్ రోడ్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో మొబైల్ ఫిష్ అవుట్లెట్ వెహికల్స్ ను మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
2.విద్యార్థుల ఆందోళన
అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ నిరుద్యోగులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, కరోనా పేరుతో వర్సిటీలు, కాలేజీల మూసివేత విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏబీవీపీ నిరుద్యోగుల ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ భవనం ముట్టడించేందుకు ప్రయత్నించారు.
3.హోళీ పండుగ పై పోలీసుల ఆంక్షలు
తెలంగాణలో హోలీ పండుగ పై పోలీసులు ఆంక్షలు విధించారు.హోలీ ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
4.జిహెచ్ఎంసి కి ఎవరూ రావద్దు
జిహెచ్ఎంసి పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లోయర్ ట్యాంక్ బండ్ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని సందర్శకుల రాకపై పాక్షిక నిషేధం విధించారు.
5.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.రిజర్వేషన్లపై 50% పరిమితి వద్దు
విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో వివిధ వర్గాలకు సామాజిక , ఆర్థిక ప్రాతిపదికన కల్పించే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
7.మూడు రాజధానులు పై విచారణ వాయిదా
ఏపీలో మూడు రాజధానులకు సంబంధించి దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసింది.
8.జిహెచ్ఎంసి కి జాతీయ అవార్డు
వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణలో సాంకేతిక విధానాలు అవలంబిస్తున్న జీహెచ్ఎంసీకి జాతీయస్థాయిలో పురస్కారం దక్కింది.ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఎగ్జిబిషన్స్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ఆరవ స్మార్ట్ సిటీస్ ఎక్స్ పో ముగింపు సందర్భంగా జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ సంతోష్ ఈ అవార్డు అందుకున్నారు.
9.ఏపీ లో సిబిఐ దాడులు
ఏపీలో పలు నగరాల్లో సిబిఐ దాడులు నిర్వహించింది.గుంటూరు, తిరుపతి ,విశాఖపట్నం లో సిబిఐ బృందాలు పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేసిన వారి ఆస్తులపై దాడులు నిర్వహించాయి.
10.466 వ రోజుకు రాజధాని నిరసనలు
రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి డిమాండ్ చేస్తూ రైతులు మహిళలు చేపట్టిన నిరసనలు 466 రోజుకు చేరుకున్నాయి.
11.ఓటు కోసం మోడీ ట్వీట్
పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
12.అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో మొదటి దశ పోలింగ్ ప్రారంభం
పశ్చిమ బెంగాల్, అసోమ్ రాష్ట్రాల్లో శనివారం ఉదయం మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
13.ఎగ్జిట్ పోల్స్ పై ఈసి బ్యాన్
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు నేటి నుంచి ప్రారంభం కావడంతో ఈ రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకుండా ఏప్రిల్ 29 వరకు నిషేధిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
14.తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థిగా చింతామోహన్
తిరుపతి ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున మాజీ ఎంపీ చింతామోహన్ పోటీ చేయనున్నారు.ఆయన అభ్యర్థిత్వం ఏఐసీసీ ఖరారు చేసింది.
15.సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
16.తన్నుకున్న సర్పంచ్ ఉప సర్పంచ్
గ్రామ పంచాయతీ కార్యాలయం లోనే సర్పంచ్ ఉప సర్పంచులు కొట్లాటలు జరిగిన సంఘటన తెలంగాణలోని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి లో చోటుచేసుకుంది.
17.లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో సన్ని లియోన్
మలయాళం నుంచి సన్నీలియోన్ కి మరో కబురు వచ్చింది.‘ షిరో ‘ అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఆమె నటించబోతోంది.
18.విశాఖలో రష్యా ఇంజనీర్ మృతి
సబ్ మెరైన్ లో లోపాలు సరి చేసేందుకు రష్యా నుంచి వచ్చిన ఇంజనీర్ గ్రాచవ్ దిమిత్రి (43) గుండెపోటుతో మృతి చెందారు.
19.కాంగ్రెస్ లో చేరిన షకీలా
ప్రముఖ గ్లామర్ తార షకీలా తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు మహాత్మ శ్రీనివాసన్ సమక్షంలో పార్టీలో చేరారు.
20.బంగారం ధరలు
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర – 43,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,750.