1.ఆన్లైన్ లోనే ఇంటర్ షార్ట్ మెమోలు
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు షార్ట్ మెమో ల కోసం కాలేజీలకు వెళ్ళనవసరం లేకుండా, కలర్ షార్ట్ మెమోలను నేరుగా ఆన్లైన్ నుంచి ప్రింటవుట్ తీసుకునేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అవకాశం కల్పించింది.
2.సంగీత, నృత్య విద్యాలయాల్లో ప్రవేశాలు
తెలంగాణలో ఆరు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలలో 2021 – 22 విద్యా సంవత్సరానికి వివిధ సర్టిఫికెట్, డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.
3.పాపికొండలు విహార యాత్ర పునః ప్రారంభం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పరిధిలో పాపికొండలు విహార యాత్ర గురువారం పున ప్రారంభం అయింది.ఏపీ పర్యాటక శాఖ మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాసరావు ఈ యాత్రను ప్రారంభించారు.
4.26 నుంచి ఐబీపీఎస్ పరీక్షకు ఉచిత శిక్షణ
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అర్హతగల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఐబీపీఎస్ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించనుంది.
5.4న సిరిసిల్లలో కేసీఆర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నల 4వ తేదీన సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
6.17,908 కోట్ల జిఎస్టి వసూలు
2000 ఒకటి సంవత్సరానికి గాను మొత్తం 17,908 కోట్ల వస్తు సేవల పన్ను వసూలు చేశామని హైదరాబాద్ సి జి ఎస్ టి జోన్ చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య తెలిపారు.
7.విహెచ్ కు సోనియా పరామర్శ
కిడ్నీ ఇన్ఫెక్షన్ తో హైదర్గూడా అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సోనియాగాంధీ ఫోన్ లో పరామర్శించారు.
8.పెద్ద పులి సంచారం
తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ అటవీ ప్రాంతంలో పశువుల పై దాడులు మొదలయ్యాయి.దీంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనలతో ఉన్నారు.
9.హైదరాబాద్ లో టీకా టెస్టింగ్ ల్యాబ్
టీకాలను పరీక్షించే ప్రయోగశాల హైదరాబాదులో ఏర్పాటు కానుంది .
10.వివేకా హత్య కేసు
దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సిబిఐ వేగవంతం చేసింది.26వ రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది.
11.ఎమ్మెల్యే రోజా వార్నింగ్
దివంగత నేత , మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే తెలంగాణ నాయకులకు మర్యాద ఉండదు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ఏఐసిసి అధ్యక్షురాలు రోజా వార్నింగ్ ఇచ్చారు.
12.సాగర్ వద్ద ఏపీ పోలీసుల బందోబస్తు
నాగార్జున సాగర్ వద్ద ఏపీ పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.
13.సాగునీటి వివాదంపై జగన్ కు రఘురామ లేఖ
ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం పై లేఖ రాశారు.
14 తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.16,872 మంది భక్తులు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు.
15.4న గుంటూరులో సాధన సమితి సమావేశం
ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల కోసం భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 4న ఉదయం 10 గంటలకు గుంటూరు అరండల్ పేట లోని వైన్స్ డీలర్స్ అసోసియేషన్ హాల్లో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి నిర్వాహక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.
16.డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి పరీక్ష అవసరం లేదు
జూలై 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి పరీక్ష అవసరం లేదని కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
17.భారత ఎంబసీపై డ్రోన్ కలకలం
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఉన్న ఇండియన్ హైకమిషన్ కాంపౌండ్ లో డ్రోన్ కలకలం రేపింది .ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
18.భారత్ లో 34 కోట్లు దాటిన వ్యాక్సినేషన్ రికార్డు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ సాధిస్తున్న భారత్ మరో రికార్డు కు చేరుకుంది.శుక్రవారం ఉదయం 7 గంటల వరకూ 34 కోట్ల , 76 వేల 232 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
19.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 46,617 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,240 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,240.