న్యూస్ రౌండప్ టాప్ 20

1.చిన్న పిల్లలకూ కరోనా వ్యాక్సిన్

 కరోనా వాక్సిన్ ను 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఈ ట్రైల్స్ పూర్తికాగానే చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది.
 

2.‘అన్యాస్  ట్యుటోరియల్ ‘ వెబ్ సిరీస్ లో రెజీనా

Telugu Ap Telangana, Devendar Goud, Etela, Jagan, Jamuna, Narendra Modi, Narsi,

  దేశ వ్యాప్తంగా ప్రస్తుతం web series ఫ్రెండ్ నడుస్తుండటంతో ప్రముఖ హీరో హీరోయిన్లు అంతా ఈ వెబ్ సిరీస్ ల పైన దృష్టి పెట్టారు.తాజాగా తెలుగులో ‘ అన్యాస్  ట్యుటోరియల్ ‘ వెబ్ సిరీస్ పేరుతో  తెలుగు వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.ఆహా, ఆర్కా మీడియా వర్క్స్ సంస్థలు దీనిని తెరకెక్కిస్తున్నాయి.దీంట్లో ప్రధాన పాత్రలో హీరోయిన్ గా రెజీనా నటిస్తున్నారు.
 

3.డైరెక్టర్ కాబోతున్న కామెడియన్

  ప్రముఖ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ డైరెక్టర్ గా మారబోతున్నారు.ఓ వెబ్ సిరీస్ కు ఆయన దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
 

4.విరిగిపడిన కొండచరియలు 12 మంది మృతి

Telugu Ap Telangana, Devendar Goud, Etela, Jagan, Jamuna, Narendra Modi, Narsi,

  మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షాలకు చెంబూరు, విక్రోలి ప్రాంతాల్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
 

5.నేడు ప్రధాని అఖిలపక్ష సమావేశం

   సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది.
 

6.రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Telugu Ap Telangana, Devendar Goud, Etela, Jagan, Jamuna, Narendra Modi, Narsi,

  సోమవారం నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.
 

7.పెరుగుతున్న గోదావరి ప్రవాహం

  ఇరు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.బ్యారేజీ 54 గేట్ల ద్వారా, 1,51,614 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
 

8.ఈటెల సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు

Telugu Ap Telangana, Devendar Goud, Etela, Jagan, Jamuna, Narendra Modi, Narsi,

  హుజురాబాద్ ప్రచారంలో ఈటెల రాజేందర్ భార్య ఈటెల జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 

9.హుజురాబాద్ లో గోడ గడియారాల పంపిణీ దుమారం

  హుజురాబాద్ ఉప ఎన్నికల ఆ సమయంలో గోడ గడియారాలు పంపిణీ కలకలం రేపుతోంది.వాటిని పంచుతున్న యువకుడిని స్థానికులు పట్టుకోగా అతను బీజేపీకి చెందిన వ్యక్తిగా కొందరు అనుమానిస్తున్నారు.గోడ గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

10.దేవేందర్ గౌడ్ తో భేటీ కానున్న రేవంత్

Telugu Ap Telangana, Devendar Goud, Etela, Jagan, Jamuna, Narendra Modi, Narsi,

  తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం దేవేందర్ గౌడ్ తో భేటీ కానున్నారు.
 

11.నేటి నుంచి విద్యార్థి జేఏసీ బస్సుయాత్ర

  తెలంగాణ విద్యార్థి జేఏసీ బస్సు యాత్ర ఆదివారం నుంచి ప్రారంభం అవుతుంది అని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
 

12.ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అరెస్ట్

Telugu Ap Telangana, Devendar Goud, Etela, Jagan, Jamuna, Narendra Modi, Narsi,

  ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నల్గొండ నుంచి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టిన ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి ని దిల్షుక్ నగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
 

13.బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ భేటీ

  బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలో ప్రారంభమైంది.ఈ భేటీకి ముఖ్యఅతిథిగా మైనార్టీ మొర్చా జాతీయ అధ్యక్షుడు జమూల్ సిద్దికీ జమాల్ పాల్గొన్నారు.
 

15.జగన్ నివాసం సమీపంలో ఫ్లెక్సీ కలకలం

Telugu Ap Telangana, Devendar Goud, Etela, Jagan, Jamuna, Narendra Modi, Narsi,

  ఏపీ సీఎం జగన్ నివాసం సమీపంలో ఫ్లెక్సీ కలకలం రేపింది.ఇళ్ల స్థలాల కేటాయింపు లో అవినీతి జరిగినట్లు ఆ ఫ్లెక్సీ లో నిర్వాసితులు ఆరోపించారు.
 

16.తిరుమల సమాచారం

  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.శనివారం తిరుమల శ్రీవారిని 18,195 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
 

17.నేడు రేపు ఏపీలో భారీ వర్షాలు

  వాయు బంగాళాఖాతం ఈనెల 21న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమల్లో నైరుతి రుతుపవనాలు ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
 

18.రేపు నిరుద్యోగుల చలో తాడేపల్లి

Telugu Ap Telangana, Devendar Goud, Etela, Jagan, Jamuna, Narendra Modi, Narsi,

  ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా న్యాయం కోసం రోడ్ ఎక్కుతున్న నిరుద్యోగులను పోలీసులు బెదిరించి నిర్వహిస్తే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు.ఈనెల 19న తమ పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లి – సీఎంకు విజ్ఞాపన పత్రం ‘ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు.
 

19.రేపటి నుంచి గుంతకల్లు కు ప్యాసింజర్ రైలు ప్రారంభం

  కోవేట్ కారణంగా గత ఏడాదిన్నర కాలంగా నిలిపివేసిన రాయచూరు గుంతకల్లు ప్యాసింజర్ రైలును సోమవారం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సలహా మండలి సభ్యుడు బాబు రావు తెలిపారు.
 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,190   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,190

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube