1.తూర్పులో 33 మంది వాలంటీర్ల తొలగింపు
విధుల్లో నిర్లక్ష్యం వహించారని కారణంతో తూర్పుగోదావరి జిల్లాలో 33 మంది వాలంటీర్లను తొలగిస్తూ తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
2.జూలై 26 నుంచి టెన్త్ పరీక్షలు
ఏపీలో పదో తరగతి పరీక్షలను జులై 26 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
3.మైక్రో సాఫ్ట్ చైర్మన్ గా సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్ గా సత్య నాదెళ్ల తిరిగి ఎంపికయ్యారు.
4.ఎల్లుండి టీటీడీ పాలక మండలి సమావేశం
ఈ నెల 21వ తేదీతో టీటీడీ పాలకమడలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎల్లుండి టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించబోతున్నారు.
5.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 67,208 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.సాయి పల్లవి కి బాలీవుడ్ ఆఫర్
టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి కి బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.దీనికి ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
7.’ ఆర్.ఆర్ ఆర్ ‘ రిలీజ్ డేట్ ఫిక్స్
దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ని వచ్చే జనవరి 26 వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.
8.ట్విట్టర్ కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు
మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కు ఇప్పటికే కేంద్రం అనేకసార్లు నోటీసు ఇవ్వగా, తాజాగా హైదరాబాద్ పోలీసులు నోటీసు జారీ చేశారు.ఫేక్ వీడియో కేసులో ఈ నోటీసు ఇచ్చారు.
9.డబ్ల్యూహెచ్ఓ తో భారత్ బయోటెక్ భేటీ
కోవిడ్ వాక్సిన్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్ బయోటెక్ అత్యవసర వినియోగం కోసం బీటెక్ అను ఉపయోగించుకునేందుకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి కోరుతూ ఇప్పటికే అనేక డాక్యుమెంట్లు సమర్పించింది ఈ నేపథ్యంలోనే ఈ నెల 23వ తేదీన బేటీ కాబోతున్నారు.
10.జగన్ కు రఘురామకృష్ణంరాజు ఎనిమిదో లేఖ
వరుసగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాస్తూ హడావుడి చేస్తున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏనిమిదో రోజు జగన్ కు లేఖ రాశారు.రాష్ట్ర ప్రజలందరికీ త్వరగా నిర్మాణం చేపట్టాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
11.టెన్త్ ఇంటర్ పరీక్షల పై జగన్ సమీక్ష
ఏపీలో టెన్త్ ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఈరోజు ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు.
12.గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు రద్దు
హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీలో నాలుగు వారాల పా,టు గ్రూప్ వన్ ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
13.హుజురాబాద్ చేరుకున్న ఈటెల రాజేందర్
ఇటీవల ఎమ్మెల్యే పదవికి టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం హుజురాబాద్ చేరుకున్నారు.
14.జైలు అధికారులకు సిఐడి కోర్ట్ మెమో
ఎంపీ రఘురామ కృష్ణంరాజు నుంచి సొంత పూచీకత్తు తీసుకునే విషయంలో గుంటూరు జిల్లా జైలు అధికారులకు సిఐడి కోర్టు మెమో జారీ చేసింది.
15.ఏపీలో లాక్ డౌన్ సడలింపు లు
ఈనెల 20 వ తేదీ తరువాత లాక్ డౌన్ లో సడలింపులు ఉంటాయని ఏపీ సీఎం జగన్ తెలియజేశారు.
16.జగన్ కు చంద్రబాబుకు లేఖ
ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.ధాన్యం బకాయిలు విడుదల చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు అని, వెంటనే ఆ బకాయిలు విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు.
17.ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
కొత్త సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసన దీక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
18.తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఈరోజు జరగనుంది.బి ఆర్ కే భవన్ లో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది.
19.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 1489 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,850 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,930.