1.భారత్ లో కరోనా
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11, 610 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.నేడు కోటి వృక్షర్చన
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
3.విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై కేంద్రం చర్చలు
విద్యుత్ చట్టం 2003 లో ప్రతిపాదిత సవరణలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నేడు సమావేశం నిర్వహించనున్నారు.
4.ఎల్పీజీ రాయితిలో కోత
కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పై ఇస్తున్న రాయితీ లో భారీగా కోత పెట్టింది.గత బడ్జెట్ తో పోల్చితే కొత్త బడ్జెట్ లో సబ్సిడీ ల కేటాయింపులపై 65 శాతం మేరకు తగ్గించింది.
5.షర్మిల పార్టీలోకి స్పీకర్ షరీఫ్
తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్న పార్టీలోకి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షరీఫ్ చేరబోతున్నారు.
6.పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన ఎన్టీఆర్
జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో సినీ హీరో ఎన్టీఆర్ పాల్గొని పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు.
7.జగన్ పై తెలంగాణ మంత్రి సెటైర్స్
జగనన్న తెలంగాణపై ఒక బాణం వేస్తే తాము కోటి బాణాలు వేస్తామని షర్మిలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు చేశారు.
8.‘ గల్లీ నుంచి ఢిల్లీ’ పాట విడుదల
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్సి శంబిపూర్ రాజు స్పాన్సర్ చేసిన ఢిల్లీ నుంచి గల్లీ అనే పాటను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
9.గొర్రెల మంద పై చిరుత దాడి
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చిరుత పులుల భయం వీడడం లేదు.ఎల్లారెడ్డి మండలం సోమార్పెట్ గ్రామంలో గొర్రెల మందపై చిరుత పులి దాడి చేసి వాటిని హతమార్చింది.
10.నేడు గులిమెలిగే పండుగ
సమ్మక్క, సారక్క మినీ జాతర నేపథ్యంలో బుధవారం గుడిమెలిగే పండుగను నిర్వహించనున్నారు.
11.ఎమ్మెల్యే హత్య కేసులో ఇద్దరు నక్సల్స్ అరెస్ట్
ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లాలో ఎమ్మెల్యే మడవి భీమా హత్యకేసులో నిందితులైన ఇద్దరు మావోయిస్ట్ లను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.
12.ఓటుకు నోటు కేసు
తెలంగాణ లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు లో ఎంపీ రేవంత్ రెడ్డి , సెబాస్టియన్ ఉదయ సింహా లపై పలు సెక్షన్ ల కింద ఏసీబీ ప్రత్యేక కోర్ట్ అభియోగాలు నమోదు చేసింది.
13.సీనియర్ నేతలతో విబేదాలపై రేవంత్ క్లారిటీ
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో విబేధాలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని, తమను వేరుగా చూడవద్దు అంటూ చెప్పారు.
14.కడప జిల్లాలో 59 పంచాయతీలు ఏకగ్రీవం
కడప జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.129 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, 59 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
15.ఇంగ్లీష్ మీడియం కేసు విచారణ వాయిదా
ప్రభుత్వ పాటశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.హై కోర్ట్ తీర్పుపై సుప్రీంకోర్టు కు ఏపీ ప్రభుత్వం వెళ్లడం తో అక్కడ ఈ కేసును మరో మూడు వారాలకు వాయిదా వేశారు.
16.అమరావతి దీక్షలు
అమరావతిలో నే ఏపీ రాజధాని కొనసాగించాలి అని కోరుతూ రైతులు, మహిళలు పెద్ద చేపట్టిన ఆందోళన 428 రోజుకి చేరుకుంది.
17 జీవిఎంసీ కమిషనర్ ఆకస్మిక బదిలీ
విశాఖ జీవీఎంసి కమిషనర్ గుమ్మళ్ల సృజనను అర్ధరాత్రి ఆకస్మికంగా బదిలీ చేయడం కలకలం రేపుతోంది.ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకే ఈ బదిలీ జరిగినట్టు సమాచారం.
18.పట్టాలు ఎక్కబోతున్న లోకల్ రైళ్లు
కరోనా కారణంగా నిలిచిపోయిన ఢిల్లీ లోని లోకల్ రైళ్లు ను యధాతధంగా నడిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.త్వరలోనే ఇవి పట్టాలు ఎక్కనున్నాయి.
19.రైలు డీ కొని సింహానికి తీవ్ర గాయాలు
అటవీ ప్రాంతంలో వేగంగా వస్తున్న రైలు డీ కొని సింహం తీవ్ర గాయాపాలయిన సంఘటన గుజరాత్ లోని అమ్రెలి జిల్లా రాజుల ప్రాంతంలో జరిగింది.ప్రస్తుతం సింహానికి పశువైద్య అధికారులతో అటవీశాఖ అధికారులు వైద్యం చేయిస్తున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,750
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,730
.