1.వైఎస్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని, ఆయన తెలంగాణకు మంచి చేశారో, ద్రోహం చేశారో గ్రామాలకు వెళ్లి అడగాలి అంటూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ షర్మిల ఓ సమావేశంలో స్పష్టం చేశారు.
2.జగన్ కేసీఆర్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
జగన్ కేసీఆర్ ఇద్దరు మోదీ తమ్ముళ్లే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
3.కేంద్ర జల శక్తి శాఖ గెజిట్ పై కేసీఆర్ ఆగ్రహం
కేంద్ర జల శక్తి శాఖ గెజిట్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
4.మంచిర్యాలలో పెద్దపులి టెన్షన్
మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి వేమనపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి హల్ చల్ చేసింది.మామడ, రాజారామ్ బీట్ పరిధిలో పశువులు మండల పై పులి దాడి చేసింది.
5.చిరుత దాడి లో లేగ దూడ మృతి
చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా చౌడపూర్ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
6.నేడు టీజీయూ సెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల అండర్గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
7.నేటి నుంచి హెచ్చార్సీ లో రోజువారీ విచారణ
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ శుక్రవారం నుంచి రోజువారీ విచారణ లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
8.కేటిఆర్ అంటే ఎవరు
కేటీఆర్ అంటే ఎవరు.? అంటూ వైఎస్ఆర్ సీపీ అధినేత షర్మిల ప్రశ్నించారు.షర్మిల నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ప్రస్తావన రాగా ఆమె ఈ విధంగా స్పందించారు.
9.వివేకా హత్య కేసు
దివంగత వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 40వ రోజు కొనసాగుతోంది.
10.జగన్ కు రఘురామ లేఖ
ఏపీలో రహదారుల వాస్తవ పరిస్థితి పై ఏపీ సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.
11.కార్యకర్తలతో జేసీ ప్రభాకర్ ఆత్మీయ సమావేశం
తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు ఎవరు మండలాల కార్యకర్తల తో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
12.ఏపీలో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీకి ఏర్పాట్లు
ఏపీలో దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.మీ సేవ కేంద్రాల్లో వారికి ముందస్తు బుకింగ్ లు ఈనెల 19 నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.
13.విజయవాడలో స్పైస్ జెట్ విమాన సర్వీసులు పునః ప్రారంభం
విజయవాడ విమానాశ్రయంలో స్పైస్జెట్ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి పునః ప్రారంభమయ్యాయి.
14.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా కొనసాగుతోంది.గురువారం తిరుమల శ్రీవారిని 17,226 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
15.భూముల వేలం పై మధ్యంతర ఉత్తర్వులు పొడగింపు
మిషన్ బిల్డ్ ఏపీ పథకంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ స్థలాలను వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఈ మేరకు విచారణ ను ఆరు వారాలు వాయిదా వేసింది.
16.ఆరు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవేట్ కేసులు తీవ్రతరమవుతుంది నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
17.బెంగళూరులో విదేశీయుల నివాసాలపై సి సి బి దాడి
బెంగళూరు నగరంలోని విదేశీయుల నివాసాలపై గురువారం సీసీబీ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా 38 మంది వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా నగరంలోనే ఉన్నట్లు గుర్తించారు.
18.బళ్లారిలో మైనింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి
బళ్లారిలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయ విశ్వవద్యాలయంలో మైనింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. .
19.చేవెళ్ల నుంచి షర్మిల పాదయాత్ర
చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలు పెడతా అని వైఎస్సార్ టిడి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,350 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,350
.