1.ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి
ఎడిట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2.ఆగస్టు తొలి వారంలో ఎంసెట్ఇం
జనీరింగ్ ఫార్మసీ వెటర్నరీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష ఆగస్టు మొదటి వారంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
3.ఈటెల బృందానికి తప్పిన ప్రమాదం
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బృందం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది.ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ అలర్ట్ అయ్యారు.దీంతో ఎటువంటి ప్రమాదం లేకుండా విమానం ల్యాండ్ అయింది.
4.యాదాద్రి కి చేరుకున్న సీజేఐ ఎన్.వి.రమణ
సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ యాదాద్రి కి చేరుకున్నారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారిగా యాదాద్రికి వచ్చిన రమణ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
5.నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఏడో దశ రైతుబంధు
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఏడో దశ రైతుబంధు ప్రారంభం కానుంది.ఈరోజు నుంచి ఈనెల 25 వరకు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.
6.డిగ్రీ లో తెలుగు మీడియం రద్దు
ఏపీలో ఇకనుంచి డిగ్రీలు తెలుగు మీడియంలో విద్యాబోధన నిలిచిపోనుంది.ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన చేయనున్నారు.
7.నేడు ధవలేశ్వరం నుంచి సాగునీరు విడుదల
ఖరీఫ్ సీజన్ కు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా సాగునీటి జలవనరుల శాఖ అధికారులు ఈ రోజు విడుదల చేయనున్నారు.
8.జగన్ కు రఘురామ మరో లేఖ
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ కు ఆరో లేఖ రాశారు.ఉద్యోగులకు డీఏ పెంపు హామీని అమలు చేయాలని ఆ లేఖలో కోరారు.
9.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 13,918 మంది భక్తులు దర్శించుకున్నారు.
10.స్మార్ట్ రేషన్ కార్డులు
త్వరలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు రానున్నాయి.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.
11.ట్విట్టర్ కు మరో నోటీసు
కొత్త ఐటీ నిబంధనల పై మరోసారి కేంద్రం ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది.ఈనెల 18న తమ ముందు హాజరు కావాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
12.చైనా కు నాటో హెచ్చరిక
చైనా విసురుతున్న వ్యవస్థాగత సవాళ్లను తిప్పికొడతామని నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ ( నాటో ) హెచ్చరించింది.
13.పిల్లలపై కొవాగ్జిన్ ట్రైల్స్
ఢిల్లీ ఎయిమ్స్ లో పిల్లలపై కోవాగ్జిన్ ట్రైల్స్ నిర్వహించనున్నారు.ఈ ట్రైల్స్ లో 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలపై ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
14.మంత్రి తలసాని పై కేసు కొట్టివేత
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరికొందరిపై పార్లమెంట్ ఎన్నికల సమయంలో నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
15.ఎస్బిఐ లో ఫైర్ ఇంజనీర్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫైర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఆన్లైన్ ద్వారా వీటికి దరఖాస్తు చేసుకోవాలి.
16.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 60,471 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.వంటల కార్యక్రమానికి హోస్ట్ గా తమన్న
ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించబోయే వంటల కార్యక్రమానికి హోస్ట్ గా నటి తమన్నా ఉండబోతున్నారు.ఈ మేరకు ఒప్పందం జరిగింది.
18.చార్ ధమ్ యాత్రకు అనుమతి వాయిదా
ఉత్తరాఖండ్ లోని మూడు జిల్లాలకు చెందిన వారిని చార్ధామ్ యాత్రకు అనుమతి ఇవ్వాలని భావించిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.
19.డిఎడ్ సెకండ్ సెమ్ పరీక్షలు వాయిదా
ఈనెల 21 నుంచి 24 వరకు జరగాల్సిన 2019 – 21 బ్యాచ్ డిఎడ్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,750 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,750