1.గవర్నర్ తో జగన్ భేటీ
ఏపీ సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు సమావేశం కానున్నారు.
2.రూపాయికే లీటర్ పెట్రోల్, డీజిల్
మహారాష్ట్రలో ఓ పెట్రోల్ బంక్ లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఒక్క రూపాయికి పోస్తున్నారని తెలియడంతో వేలాది మంది జనాలు క్యూ కట్టారు.అయితే మహారాష్ట్ర యువనేత పర్యావరణ మంత్రి ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రూపాయికి పెట్రోల్ , డీజిల్ ను అందించారు.
3.బీజేపీ లో నేడు చేరనున్న ఈటెల రాజేందర్
తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.ఈరోజు ఆయన బిజెపిలో చేరబోతున్నారు.
4.సిమ్లాలో ఆంక్షలు ఎత్తివేత
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో హిమాచల్ ప్రదేశ్ కరోనా ఆంక్షలను ఎత్తివేసింది.
5.నిజాం క్లబ్ లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని నిజం క్లబ్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది.భారీగానే ఆస్తినష్టం జరిగింది.షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
6.నేడు హైదరాబాద్ కు ఎల్.రమణ
టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఈరోజు జగిత్యాల నుంచి హైదరాబాద్ కు రానున్నారు.భవిష్యత్ కార్యాచరణపై నేడు ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
7.విహెచ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపడానికి కొంతమది నేతలు కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు సంచలన ఆరోపణలు చేశారు.
8.అదనపు కలెక్టర్లకు కియా కార్లు
తెలంగాణలో 32 జిల్లాలో అదనపు కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కియా కార్నివాల్ వాహనాలను మంజూరు చేసింది.
9.సింగరేణిలో 54% వ్యాక్సినేషన్
సింగరేణిలో 54% కార్మికులు వాక్సిన్ తీసుకున్నారని ఆ సంస్థ సీఎండీ ఎం శ్రీధర్ తెలిపారు.
10.ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పై భూకబ్జా ఆరోపణలు
ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ భూకబ్జా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఓ పొలాన్ని స్టీఫెన్ సన్ అనుచరులు చదును చేశారు.అడ్డుకునేందుకు వెళ్ళిన భూమి యజమానిని బెదిరించారు.దీంతో బాధితుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
11.మలేరియా రహిత తెలంగాణ
రాబోయే మూడేళ్లలో తెలంగాణ మలేరియా రహిత రాష్ట్రంగా మారనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది.
12.సీఎం జగన్ కు రఘురామ మరో లేఖ
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ కు మరో లేఖ రాశారు.అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే ఆదుకోవాలని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా 1,100 కోట్ల ను తక్షణమే విడుదల చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
13.జగన్ బెయిల్ రద్దు పై నేడు విచారణ
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ పై ఈరోజు సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది.
14.తిరుమల సమాచారం
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది.ఆదివారం శ్రీవారిని 15,314 మంది భక్తులు దర్శించుకున్నారు.
15.బ్లాక్ ఫంగస్ కేసులు
మహారాష్ట్ర లో 7,295 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
16.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.డ్రోన్ తో టీకాలు
రవాణా సదుపాయాలు లేని క్లిష్టమైన కొండ ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా టీకాలను చేరవేయాలని కేంద్రం నిర్ణయించింది.
18.భారత్ ప్రయాణికులపై పాక్ నిషేధం
భారత్ తో సహా 26 దేశాల కు సంబంధించిన ప్రయాణికులపై బ్యాన్ విధిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది.
19.ఇజ్రాయిల్ ప్రధానిగా బెన్నెట్ ప్రమాణం
ఇజ్రాయిల్ నూతన ప్రధానమంత్రిగా నప్తాలీ బెన్నెట్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల ధర -47,720 24 క్యారెట్ల 10 గ్రాముల ధర – 48,720.