1.రాజస్థాన్ లో కప్పా వైరస్
కరోనా వైరస్ కొత్త వేరియంట్ కప్పా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.ఇప్పటివరకు 11 కేసులు నమోదయ్యాయి.
2.జగన్ ను కలిసేందుకు తెలంగాణ యువకుడి పాదయాత్ర
జగన్ పై ఉన్న అభిమానంతో ఆయనను కలిసేందుకు తెలంగాణకు చెందిన యువకుడు పాదయాత్ర చేపట్టాడు.ఈనెల 8వ తేదీ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జగన్ కోసం తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లా కనిగిరి మండలం మరియు గ్రామానికి చెందిన పబ్బు కిషోర్ అనే యువకుడు పాదయాత్ర చేపట్టాడు.
3.కేటీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక భేటీ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్ లో పార్టీ కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
4.హుజురాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ఇన్చార్జిల నియామకం
హుజురాబాద్ ఉప ఎన్నిక ఇన్చార్జి లను టిపిసిసి ప్రకటించింది.
5.మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగు బాటు
దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న కుమారుడు రావుల రంజిత్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.
6.ఆగస్టు చివరలో సీపీగెట్ 2021
ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు కాకతీయ, శాతవాహన , పాలమూరు , తెలంగాణ, మహాత్మాగాంధీ , జె ఎన్ టియూల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం సీపీ గెట్ 2021 ను ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
7.ఐదో తరగతిలో ప్రవేశాలకు 18న వీటీజీ సెట్
తెలంగాణలోని సాంఘిక గిరిజన బీసి జనరల్ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఐదో తరగతి ప్రవేశాల కోసం ఈనెల 18న వీటీజీ సెట్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
8.కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో రేవంత్ భేటీ
పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చేందుకు రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది.
9.సుప్రీం కోర్టులో ఏపీ పిటిషన్
కృష్ణా జలాల వివాదంపై సుప్రిం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది.కృష్ణా జల్లాల్లో తమకు రావాల్సిన చట్టబద్ధమైన వాటాను తెలంగాణ ప్రభుత్వం రానివ్వడం లేదంటూ పిటిషన్ లో పేర్కొంది.
10.లోకేష్ పరామర్శ
కృష్ణా జిల్లా దుగ్గిరాల మండలం గొడవర్రు లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా ఇటీవల కరోనా సోకి కోలుకున్న 40 మందిని లోకేష్ పరామర్శించారు.
11.కొనసాగుతున్న వివేకా హత్య కేసు విచారణ
కడప సెంట్రల్ జైలు కేంద్రంగా దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సిబిఐ కొనసాగిస్తోంది.ఈ విచారణ ప్రారంభమై నేటికి 38 రోజులు.
12.జగన్ కు రఘురామ లేఖ
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు, వదంతులపై నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.
13.భారత్ కు కరోనా థర్డ్ వేవ్ భయం
భారత్ లో కరోనా వైరస్ ప్రమాదం పొంచి ఉందని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ హెచ్చరించారు.
14.పోలవరం మాజీ ఎమ్మెల్యే మృతి
పోలవరం మాజీ ఎమ్మెల్యే వంక శ్రీనివాస రావు మృతి చెందారు.1999లో టిడిపి తరఫున పోలవరం ఎమ్మెల్యేగా వంకా శ్రీనివాసరావు గెలుపొందారు.
15.తిరుమల సమాచారం
తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 12,141 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
16.బిజెపి మహిళా మోర్చా అత్యవసర సమావేశం
రేపు విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా సమావేశం కానుంది.
17.జగన్ బెయిల్ రద్దు కేసు నేడు విచారణ
ఏపీ సీఎం జగన్ బెయిల్ను రద్దు కేసుకు సంబంధించి ఈ రోజు సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది.
18.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,792 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.ఏపీలో ఐపీఎస్ ల బదిలీ
ఏపీలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
20.భారత్ లో ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,900 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,900