న్యూస్ రౌండప్ టాప్ 20
1.రాజసింగ్ పై ఓయూ పీఎస్ లో ఫిర్యాదు
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓయూ పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు అందింది.మంగళవారం సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చైర్మన్ గాలి వినోద్ కుమార్, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక అధ్యక్షురాలు ఇందిర, బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు అంజలి, నవభారత నిర్మాణం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చంద్రకళ తదితరులు రాజాసింగ్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
2.చిరుత కలకలం
ములుగు జిల్లా వాజేడు మండలం లో చిరుత పులి చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి చెందింది.దూలపురం అటవీ ప్రాంతంలో పశువుల మందపై చిరుత దాడికి పాల్పడింది.
3.కొవిడ్ వాక్సిన్ సురక్షితమైంది : ఎస్వీ కృష్ణారెడ్డి
కోవిడ్ వాక్సినేషన్ సురక్షితమైంది అని, సినీ దర్శక నిర్మాత లు ఎస్వీ కృష్ణారెడ్డి , అచ్చిరెడ్డి అన్నారు.
4.ఈనెల 28న ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ పరీక్ష
ఎన్టీఆర్ విద్యా సంస్థ గత ఆరేళ్లగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్ షిప్ టెస్ట్ ను ఈ నెల 28 న నిర్వహిస్తున్నాం అని ఎన్టీఆర్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తెలిపారు.
5.ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పోస్టల్ కార్యాలయంలో ప్రత్యేక పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు.
6.రణ్ బీర్ కపూర్ కు కరోనా పాజిటివ్
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కు కరోనా పాజిటివ్ సోకింది.
7.టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హారిక
రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ టీవీ షోలో పాల్గొన్న దేత్తడి హారిక ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
8.వాటర్ బోర్డ్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
హైదరాబాద్ వాటర్ బోర్డ్ లో మేనేజర్ పోస్టుల భర్తీకి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టిఎస్పిఎస్సి తెలిపింది.ఎందుకైనా అభ్యర్థుల హాల్టికెట్ నెంబర్ లను సైతం అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
9.మంత్రులపై ఫిర్యాదు
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంత్రులు, పలువురు నాయకులు ఎన్నికల నియమావళి ని ఉల్లంఘించారని తెలంగాణ ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ కు కాంగ్రెస్ నేతలు శశిధర్ రెడ్డి, నిరంజన్ తదితరులు ఫిర్యాదు చేశారు.
10.హౌరా రూరల్ ఎస్పీ పై ఈసీ వేటు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హౌరా రూరల్ ఎస్పీ సౌమ్య రాయ్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ తొలగించింది.
11.రైల్వే ఫిర్యాదులకు డైల్139
భారతీయ రైల్వే లు ప్రయాణికుల సౌలభ్యం కోసం అన్ని హెల్ప్ లైన్ నంబర్ల కు బదులు ఇప్పుడు 139 నంబర్ డయల్ చేస్తే సరిపోతుందని రైల్వే శాఖ ప్రకటించింది.
12.స్టాలిన్ , అన్బు మణి , దినకరన్ లపై కేసులు రద్దు
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ , ఏ ఎం కే ప్రధాన కార్యదర్శి టీటివి దినకరన్ , పిఎంకె యువజన విభాగం అధ్యక్షుడు అన్బు మణి పై మోపిన క్రిమినల్ కేసులను రద్దు చేస్తూ మద్రాస్ హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది.
13.ప్రధానికి జగన్ లేఖ
స్టీల్ ప్లాంట్ ద్రోహం కేంద్రం తీరును తప్పుబడుతూ ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు.
14.154 స్థానాల్లో కమల్ పార్టీ పోటీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 154 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ప్రకటించారు.
15.పార్లమెంట్ లో నేడు ‘ చమురు ‘ నిరసనలు
దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న చమురు , వంట గ్యాస్ ధరలను నిరసనగా పార్లమెంట్ ఉభయ సభల్లో మంగళవారం కూడా ఆందోళనకు దిగాయి.
16.ఉచితంగానే కొవిడ్ – 19 వాక్సిన్
ఢిల్లీ పౌరులు అందరికీ ఉచిత కరోనా వాక్సిన్ అందిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు.
17.ఇంకా ఉద్రిక్తంగా నే భైంసా
భైంసా లో వ్యాపార సంస్థలు ఇంకా తెరుచుకోలేదు.పట్టణంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
18.జివీ ఎంసీ ఎన్నికలను బహిష్కరించాలి
స్టీల్ ప్లాంటును అమ్మేస్తా వంటి కేంద్రం చేసిన ప్రకటనపై విశాఖ వాతావరణం వేడెక్కింది కార్మికుల నిరసనలతో స్టీల్ సిటీ ఉద్రిక్తంగా మారింది.ఈ సందర్భంగా జివిఎంసి ఎన్నికలను బహిష్కరించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
19.తాడిపత్రి ని కాపాడుకోండి : జేసీ ప్రభాకర్ రెడ్డి
వైసీపీ పాలన లో తనలాంటి వారికి రక్షణ కరువైంది.ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి.చేతులు జోడించి వేడుకున్నా, మీ ఊరిని మీరే కాపాడుకోండి.తాడిపత్రి నుండి కాపాడుకోండి అంటూ ప్రభాకర్ రెడ్డి సోమవారం తాడిపత్రిలో ప్రచారం నిర్వహించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 43,690
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,690
.