1. జగన్ కు ఆనందయ్య లేఖ
కరోనా మందు అందిస్తున్న ఆనందయ్య ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు.కరుణ అన్ని జిల్లాలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ద్వారా పంపిణీ ఏర్పాట్లు చేసేందుకు సహకరించాలని టూ జగన్ కు లేఖ రాశారు.
2.నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం స్థానం ఈ సందర్భంగా లాక్ డౌన్, సడలింపు లు తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
3.వైయస్సార్ హెల్త్ ట్రస్ట్ లో ఉద్యోగ అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అవుట్సోర్సింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
4.జగనన్న తోడు పథకం ప్రారంభం
ఈరోజు జగనన్న తోడు పథకం ప్రారంభం అయింది.దాదాపు 9.5 లక్షల మంది నిరుపేద చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
5.గవర్నర్ కి చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు ఆయన పోలీసులపై ఫిర్యాదు చేశారు.
6.కెసిఆర్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధం
కెసిఆర్ కు బుద్ధి చెప్పేందుకు హుజురాబాద్ ప్రజలు సిద్ధమని మాజీమంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
7.నకిలీ విత్తనాల పట్టివేత
సూర్యాపేట జిల్లా లోని తుంగతుర్తి నియోజకవర్గం లో భారీగా నకిలీ విత్తనాలను అధికారులు పట్టుకున్నారు.వీటి విలువ దాదాపు 60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
8.సంగం డైరీ మేనేజర్ కు పోలీసుల నోటిసులు
గుంటూరు సంగం డైరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.విజయవాడలో సంగం డైరీ పాలకమండలి సమావేశం నిర్వహించడం పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా శ్రీధర్ ఇంటికి వెళ్లారు అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతో 160 సి ఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేశారు.
9.గురుకుల కాలేజీ ల్లో దరఖాస్తు గడువు పెంపు
సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
10.తెలుగు రాష్ట్రాలకు 5వేల టన్నుల ఆక్సిజన్
కరోనా సేవలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల కు 5,045 మెట్రిక్ టన్నుల ద్రవ రూప వైద్య ఆక్సిజన్ను సరఫరా చేసినట్లు దర్శనం మధ్య రైల్వే తెలిపింది.
11.కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ దీక్ష
కరుణ బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు గాంధీ భవన్ సోమవారం ఉదయం 9 గంటల నుంచి సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు.
12.11న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఈనెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
13.సీతక్క తల్లి సమ్మక్క ను పరామర్శించిన బాబు
గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్సపొందుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి సమ్మక్క ను టిడిపి అధినేత చంద్రబాబు పరామర్శించారు.
14.మంత్రుల అవినీతి చిట్టా తీస్తున్నాం
తెలంగాణలో మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాల చిట్టా బయటకు తీసుకున్నామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
15.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.చీటింగ్ కేసులో గాంధీ మునిమనవరాలు కి ఏడేళ్ళ జైలు
మహాత్మాగాంధీ మునిమనవరాలు ఆశిష్ లత రామ్ గోబిన్ కు దక్షిణాఫ్రికా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించడం సంచలనం రేపింది.
17.నటుడు చేతన్ పై బ్రాహ్మణ సంఘం ఫిర్యాదు
బ్రాహ్మణులను కించపరిచే లో మాట్లాడిన నటుడు పై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ అభివృద్ధి మండలి అధ్యక్షుడు సచ్చిదానందమూర్తి బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
18.53 మంది ప్రభుత్వ న్యాయవాదులు తొలగింపు
మద్రాస్ హైకోర్టు హైకోర్టు మధురై బెంచ్ లో అన్నాడిఎంకె ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తరపున వాదించేందుకు నియమితులైన 53 మంది న్యాయవాదులు పదవి కోల్పోయారు.
19.కోర్టుల ప్రత్యక్ష ప్రసారం పై ముసాయిదా
న్యాయస్థానాల కార్యకలాపాలు మరింత పారదర్శకత తీసుకువచ్చే దిశగా మరో అడుగు ముందుకు పడింది కోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారాలు చిత్రీకరణకు సంబంధించిన నియమ నిబంధనల ముసాయిదాను సుప్రీంకోర్టు ఈ – కమిటీ సోమవారం విడుదల చేసింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,680 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,680
.