1.ఖైదీల తరలింపు ప్రారంభం
వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఖైదీల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.ప్రత్యేక బస్సులు ఎస్సార్ సిబ్బంది ఇప్పటికే జైలుకు చేరుకుని మొదటి విడతగా 119 మంది ఖైదీలను హైదరాబాద్ చర్లపల్లి జైలుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
2.జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటన
నల్ల పాట ఎమ్మెల్సీ కవిత మంగళవారం జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు.
3.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4.గజ్వేల్ లో షర్మిల పర్యటన
రేపు గజ్వేల్ నియోజకవర్గం లో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు.
5.బ్లాక్ ఫంగస్ నివారణ పై హైకోర్టు లో పిటిషన్
నివారణకు ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టాలని హై కోర్టు లో పిటిషన్ దాఖలు అయ్యింది.
6.పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడగించింది.షెడ్యూల్ ప్రకారం జూన్ 1 న బదులు ప్రారంభం కావాల్సి ఉంది.పదిహేను రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలంగాణ విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు.
7.రేపు నుంచి బ్యాంకులు 2 గంటలకు వరకు
తెలంగాణలో మధ్యాహ్నం 12 గంటల వరకే పరిమితం అయిన బ్యాంక్ సేవలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయని తెలంగాణ బ్యాంకర్ల కమిటీ తెలిపింది.
8.నేడు రేపు భారీ వర్షాలు
తెలంగాణలో మంగళ ,బుధవారాల్లో కొన్ని జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
9.నేడు పాస్ పోర్ట్ కార్యాలయాల పునః ప్రారంభం
పాస్ పోర్ట్ కార్యాలయాల్లో సేవలను మంగళవారం నుంచి పునః ప్రారంభించనున్నారు.
10.18 వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం
తెలంగాణలో ఈ ఏడాది 18,492 కోట్లతో 33 జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
11.మూడు నుంచి డ్రైవర్లకు టీకా
తెలంగాణలోని ఆర్టీసీ, ఆటో, క్యాబ్ డ్రైవర్ లకు ఈ నెల 3 నుంచి కరోనా టీకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.
12.లోక యుక్తాలో విచారణలు వాయిదా
రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడగించిన నేపథ్యంలో ఈ నెల 11 వరకు విచారణలు వాయిదా వేస్తున్నట్లు లోకయుక్త రిజిస్ట్రార్ నీరజ తెలిపారు.
13.రఘు రామ పిటిషన్ కొట్టివేయండి : జగన్
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై న్యాయ స్థానంలో కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో రఘురామ పిటిషన్ ను కొట్టివేయాలని జగన్ కోరారు.
14.స్పీకర్ తమ్మినేని కి అస్వస్థత
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ప్రస్తుతం తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో ఆయన చికిత్స కొనసాగుతోంది.
15.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ ప్రముఖ క్రమంగా పెరుగుతోంది.నిన్న స్వామివారిని 13,412 మంది దర్శించుకున్నారు.
16.కర్నూల్ లో వైట్ ఫంగస్
కర్నూల్ జిల్లాలో వైట్ ఫంగస్ కలకలం రేపుతోంది.వెలుగోడు మండలం గుంత కందాల లో షేక్ జొల్లు భాషకు వైట్ ఫంగస్ సోకినట్టు వైద్యులు తెలిపారు.
17.ఏపీలో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 7,943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.కరోనా పరిస్థితుల పై నివేదిక
తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం తరపున పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ , డీజీపీ , కార్మిక , జైళ్ల శాఖలు , జిహెచ్ఎంసి హైకోర్టుకు నివేదిక సమర్పించాయి.
19.నటుడు అజిత్ ఇంటికి బాంబ్ బెదిరింపు
తమిళ హీరో అజిత్ కు బాంబ్ బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపుతోంది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,900 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,900
.