1.భారీ ప్యాకేజీని ప్రకటించిన జో బైడన్
కరుణ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఎప్పటికీ తగిన చర్యలు మొదలు పెట్టింది.అంతే కాదు 2.3 ట్రిలియన్ డాలర్లతో కొత్త ప్యాకేజీని ప్రకటించారు.మౌలిక సదుపాయాల రంగానికి ఉద్దీపన కలిగించేలా ఈ ప్యాకేజీ ఉంటుందని బైడన్ ప్రకటించారు.
2.కరోనా ఆసుపత్రిలో చేరిన బప్పిల హరి
ప్రముఖ సంగీత దర్శకుడు భక్తి లహరి కరుణ ప్రభావం కి గురయ్యారు.దీంతో ఆయనను ముంబైలోని బ్రిచ్ కాండి ఆస్పత్రిలో చేర్చారు.
4.ఏ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు : బండి సంజయ్
తెలంగాణలో ఏ పార్టీతో తమకు పొత్తు ఉండదని, ఒంటరిగానే ఎన్నికలకు వెళతామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.
5.ఆర్ ఆర్ ఆర్ రైట్స్ దక్కించుకున్న పెన్ స్టూడియో
ఆర్ ఆర్ ఆర్ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.
7.తెలంగాణలో కరోనా
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజు కీ పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 887 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
కెనడా లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.నల్గొండ జిల్లా డిండి మండలం ఆకు తోటపల్లి వాసి ప్రవీణ్ రావు కెనడా లో ఈ రోజు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
9.ఏపీ ఎస్ఈసీ గా నీలం సాహ్ని
ఏపీ ఎన్నికల అధికారిగా మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.
10.వెటర్నరీ, అగ్రికల్చర్ వర్సిటీల్లో 127 పోస్టులు
తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ , ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీల్లో 127 పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సీ బుదవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
11.కుమరం భీమ్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్
జిల్లాలో శాంతి భద్రతలను కాపాడే నిమిత్తం 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్టు జిల్లా ఇంఛార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు.
12.టిఎస్పిఎస్సి తాత్కాలిక చైర్మన్ గా సాయిలు
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తాత్కాలిక చైర్మన్ గా సీ హెచ్ సాయిలు ను ప్రభుత్వం నియమించింది.
13.బ్రెజిల్ లో కోవాగ్జిన్ తిరస్కరణ
భారత్ బయోటెక్ సంస్థ కరుణ పేట ఉత్పత్తిలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ ‘అన్విసా ‘ తమ దేశంలోకి కోవగ్జిన్ దిగుమతి ని తిరస్కరించింది.
14.భారత్ లో కరోనా
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 72,330 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
15.బ్రెజిల్ లో కొత్త రకం కరోనా
దక్షిణాఫ్రికా లో బయటపడిన కొత్త రకం కరోనా రకాన్ని బ్రెజిల్ లోనూ శాస్త్రవేత్తలు గుర్తించారు.బ్రెజిల్ లోని సావోపాలో రాష్ట్రంలో దీన్ని గుర్తించినట్టు భూటాంటన్ బయో మెడికల్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.
16.కోవిడ్ వాక్సిన్ తీసుకున్న జగన్ దంపతులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆయన భార్య భారతీ ఈ రోజు గుంటూరులోని భారత్ పేట ఆరో లైన్ లోని 140 వ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని టీకా వేయించుకున్నారు.
17.నేటి నుంచి గ్యాస్ సిలెండర్ ధర తగ్గింపు
గత ఫిబ్రవరి లో వంట గ్యాస్ ధరను 125 పెంచిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు , సిలిండర్ ధరను రూ.పది రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.
18.శ్రీవారి ఆలయం పోటు లో అగ్ని ప్రమాదం
తిరుమల శ్రీవారి ఆలయంలోని వకుళామాత పోటులో గురువారం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది.గోనె సంచులకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
19.సాగర్ ఉప ఎన్నికల్లో 17 నామినేషన్ల తిరస్కరణ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కు సంబంధించి మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేయగా 17 మంది అభ్యర్థుల నామినేషన్ లు తిరస్కరించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 43,370
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,370.