1.గులాబీ దుస్తులు ధరించే ప్లీనరీకి రావాలి
ఈ నెల 25న ప్లీనరీలో పార్టీ అధ్యక్షుని ఎన్నుకుంటారని, గులాబీ దుస్తులు ధరించి ప్రతినిధులు సమావేశానికి రావాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
2.టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటిసులు
టిడిపి కార్యాలయం మంగళగిరి పోలీసులు నోటీసు జారీ చేశారు.
3.దేశంలోనే చరిత్ర సృష్టించిన పార్టీ టిఆర్ఎస్ : తలసాని
దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ టిఆర్ఎస్ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
4.కాంగ్రెస్ తో కలిసి కర్మ మాకేంటి : కిషన్ రెడ్డి
హుజురాబాద్ ఎన్నికల అంశంపై మాట్లాడిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓ సందర్భంలో కాంగ్రెస్ తో కలిసి కర్మ మాకేంటి అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
5.నేడు బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు
హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా నేడు బిజెపి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
6.దీపావళి తర్వాత శివసేన ప్రక్షాళన
దీపావళి పండుగ ముగిసిన తర్వాత శివసేన ప్రక్షాళన చేయాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది.
7.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 27,473 మంది భక్తులు దర్శించుకున్నారు.
8.షర్మిల పాదయాత్ర
షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం రంగారెడ్డి జిల్లా లోని రాజేందర్ నగర్ నియోజకవర్గంలో కొనసాగింది.
9.నేడు 14 పరీక్షా కేంద్రాల్లో పీఈ సెట్
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు వీసీ గోపాల్ రెడ్డి తెలిపారు.
10.చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఖరారైంది.దీంతో సోమవారం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.
11.సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా ఆర్ టి సి బస్
పెళ్లిళ్లు, వేడుకలు, దూరప్రాంతాల టూర్లకు బృందాలుగా వెళ్లేందుకు ముందస్తు సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా బస్సులను బుక్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు టిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ తెలిపారు.
12.జనవరిలో జాతీయ ప్రతిభ పరీక్ష
జాతీయ ప్రతిభా పరీక్షను 2022 జనవరిలో నిర్వహించాలని నిర్ణయించారు.
13.జగన్ అక్రమాస్తుల కేసు
వైయస్ జగన్ అక్రమాస్తుల కేసును నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
14.కెసిఆర్ బహిరంగ సభ
తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభను హుజురాబాద్ ఆనుకుని ఉన్న సమీప ప్రాంతంలో ఈ నెల 27న నిర్వహించబోతున్నారు.
15.24 నుంచి గొర్రెల పంపిణీ
వాటా దనం చెల్లించిన గొల్లకుర్మలకు ఈ నెల 24 నుంచి గొర్రెల యూనిట్ల పంపిణీని ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
16.జస్టిస్ ఉజ్జల్ భూటాన్ ప్రమాణస్వీకారం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూటాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
17.ఇప్పుడే రాజీనామా చేస్తా : వల్లభనేని వంశీ
చంద్రబాబు చేపట్టిన దీక్షలు మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు తాను ఇప్పుడే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
18.రెండు కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
మేడ్చల్ ,మల్కాజిగిరి జిల్లా ల్లో 2 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు.
19.రేవంత్ రెడ్డి ఓ లీడరా : మంత్రి మల్లారెడ్డి
రేవంత్ రెడ్డి ఓ లీడరా అంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విమర్శించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,650
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,650
.