1.అంబేద్కర్ వర్సిటీ పరీక్షలు
వాయిదా వేసిన అన్ని పరీక్షలను ఈ నెల 23 24 తేదీల్లో నిర్వహిస్తామని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.
2.హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ను బిజెపి అధికారికంగా ప్రకటించింది.
3.రేపటి నుంచి వోల్వో బస్ సర్వీసులు
పికెట్ జేబీఎస్ నుంచి కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ వరంగల్ ఖమ్మం భద్రాచలం ప్రాంతాలకు అతి తక్కువ ఛార్జితో లో ఫ్లోర్, ఓల్వో బస్ సర్వీసులను నడిపించునునట్లు ఆర్.ఎం యుగేందర్ తెలిపారు.
4.బద్వేల్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తాం
బద్వేల్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తామని అట్లూరు మండలం చిన్న రాజు పల్లి గ్రామస్తులు ప్రకటించారు.
5.కొడాలి నాని కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బెదిరింపులకు జగన్ ప్రభుత్వం భయపడదు అని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు.
6.మామ గంగి రెడ్డి వర్ధంతి లో పాల్గొన్న జగన్
ఏపీ సీఎం జగన్ తన మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ప్రధమ వర్ధంతి లో పాల్గొన్నారు.
7.అగ్రి సెట్ కౌన్సిలింగ్ వాయిదా
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్ -2021 బీఎస్సీ ( హాన్స్ ) వ్యవసాయం కౌన్సిలింగ్ ను 11 వ తేదీకి వాయిదా వేశామని రిజిస్ట్రార్ గిరిధర్ తెలిపారు.
8.పవన్ వ్యాఖ్యలను సమర్డిస్తున్నా : చేగొండి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య తెలిపారు.
9.పవన్ కు మంత్రి బాలినేని సవాల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు దమ్ము ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేసి సత్తా ఏంటో చూపించుకోవాలని బాలినేని సవాల్ చేశారు.
10.బెంగాల్లో సంబరాల పై ఈ సి హెచ్చరిక
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల ఫలితాలు తరువాత హింసకు అవకాశాలు ఉన్నాయని ఎటువంటి సంబరాలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
11.ఘన విజయం సాధించిన మమత బెనర్జీ
భవానీపుర్ ఉప ఎన్నికల్లో మమత బెనర్జీ 58,389 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
12.బెంగళూరులో పవన్ కు ఘన స్వాగతం
జనసేన పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
13.దుబాయ్ ఎక్స్పో నిర్మాణంలో ముగ్గురు మృతి
వరల్డ్ హెయిర్ కోసం దుబాయ్ చేస్తున్న నిర్మాణ పనుల్లో ముగ్గురు కూలీలు మృతి చెందారని 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు.
14.బాలయ్య మంచు విష్ణు థాంక్స్
” ఒక్క దానం ఒక్క నట సింహానికి థాంక్స్.మద్దతుగా నిలిచి ఆశీర్వదించి నందుకు బాల అన్నకు ధన్యవాదాలు.” అంటూ మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు ట్వీట్ చేశారు.
15.డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు
నిన్న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీ పై ఎన్.సీ.బీ ఆకస్మిక దాడి చేసింది.ఈ దాడుల్లో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
16.పేరు మార్చిన సమంత
సోషల్ మీడియా అకౌంట్ లో ఎస్ అనే అక్షరాన్ని తొలగించి సమంత గా సమంత పేరుని మార్చారు.
17.గాజువాక లో వైష్ణవ్ తేజ్ , కృతిసెట్టి
ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ , కృతీసెట్టి గాజువాకలో ఓ ప్రవేట్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు.
18.కాణిపాకం కి సీఎం జగన్
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఏపీ సీఎం జగన్ ఈనెల 11న దర్శించుకోనున్నారు.
19.దుర్గమ్మ సేవలో సీఎస్
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమును ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ దర్శించుకున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,560
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,720
.