1.హైదరాబాద్ కు చేరుకున్న స్పుత్నిక్ వాక్సిన్
రష్యా లో తయారవుతున్న కరోనా విరుగుడు స్పుత్నిక్ వ్యాక్సినేషన్ రెండో బ్యాచ్ లో లక్షా 50 వేల డో సులు హైదరాబాద్ కు చేరుకున్నాయి.
2.ఉదయం 6:30 నుంచి 9:30 వరకు బస్ పాస్ కౌంటర్ లు
హైదరాబాద్ సిటీ లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా గ్రేటర్ లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.ఉదయం 6:30 నుంచి 9:30 వరకు బస్ పాస్ కౌంటర్ లు పని చేస్తాయని ఆయన అన్నారు.
3.ఈటెల రాజేందర్ తో కొండా సురేఖ భేటీ
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కొండా సురేఖ ఆదివారం భేటీ అయ్యారు.
4.బిట్స్ పిలానీ దరఖాస్తు గడువు పొడగింపు
బిట్స్ పిలానీ ప్రవేశపరీక్ష బిట్ సాట్ 2021 దరఖాస్తుల స్వీకరణ గడువును జూన్ 30 వరకూ పొడిగించారు .
5.పీఈ సెట్ దరఖాస్తు గడువు పెంపు
వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాలకు టి ఎస్ పీఈ సెట్ 2021 దరఖాస్తు గడువును పొడిగించారు.ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా, ఈ నెల 22 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
6.రేపటి నుంచి ప్రత్యేక పాస్ పోర్ట్ కౌంటర్
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలను రద్దు చేసిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించాలని నిర్ణయించింది.సికింద్రాబాద్ లోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం లో ఈ కౌంటర్ సోమవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పని చేస్తుందని తెలంగాణ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి బాలయ్య తెలిపారు.
7.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 4,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,11,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.ఏపీ లో కరోనా
గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 22,517 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
10.హుస్సేన్ సాగర్ లో కరోనా ఆనవాళ్లు
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో కరోనా పదార్థాల ఆనవాళ్లు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది .హైదరాబాద్ చెరువుల్లోని నీటిని నమూనాలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ , అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ లు సంయుక్తంగా పరీక్షలు నిర్వహించాయి.
11.వైద్య శాఖలో 7180 పోస్టుల భర్తీకి ఆమోదం
రాష్ట్రంలో కరవు తీవ్రతను నేపథ్యంలో ఆసుపత్రిలో సిబ్బంది కొరత అధిగమించేందుకు తాత్కాలిక నియామకాలకు తెలంగాణ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది .ఈ మేరకు ఆయా విభాగాల్లో 7180 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
12.సింగిల్ డోస్ స్పుత్నిక్ కు వెనిజులా ఆమోదం
రష్యా లో తయారు చేసిన స్పుత్నిక్ వాక్సిన్ వినియోగానికి వెనిజులా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
13.28 న జీఎస్టీ మండలి సమావేశం
ఈ నెల 28 న జిఎస్టి మండలి సమావేశం జరగనుంది.
14.పీఎం కేర్స్ నిధులతో వ్యాక్సిన్ కొనాలంటూ పిటిషన్
పిఎం కేర్స్ నిధులను వ్యాక్సిన్ కొనుగోలుకు వినియోగించాలి అంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.న్యాయవాది విప్లవ శర్మ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
15.కరోనా తో కాంగ్రెస్ ఎంపీ మృతి
కారోనాతో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
16. కరోనా తో మాజీ మంత్రి మృతి
కరోనా తో మాజీ మంత్రి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి (68 ) మృతి చెందారు.
17.పోలీస్ శాఖలో గర్భిణులకు వర్క్ ఫ్రం హోం
కరోనా నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖలు గర్భిణీలు ఇంటి నుంచే పనిచేసేలా అవకాశం కల్పించినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
18.తెలంగాణలో నేడు రేపు వర్షాలు
టౌటే తుఫాన్ ప్రభావం తో నేడు , రేపు తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
19.అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సీతక్క నిరసన
కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని కోరుతూ ,తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,070
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,070.