1.కెసిఆర్ జైలుకే : బండి సంజయ్
త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
2.వాహనాలు నిలిపివేయడంపై హైకోర్టులో పిల్
కర్ఫ్యూ నేపథ్యంలో తెలంగాణ బోర్డర్లో ఏపీ న్యాయవాదులను నిలిపివేయడంపై ఏపీ న్యాయవాది బి ఎస్ ఎన్ వి ప్రసాద్ బాబు సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
3.టి.కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
టీ సేవ ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేందుకు అర్హత ,ఆసక్తి గల అభ్యర్థులు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని టి.సేవ కేంద్రం డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు.మరిన్ని వివరాలకు 8179955744 నంబర్ ను సంప్రదించాలన్నారు.
4.త్వరలో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ
త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకాలను త్వరలోనే చేపడతామని మంత్రి గంగుల కమలాకర్ ప్రయత్నించారు.
5.కల్తీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ లు
తెలంగాణలో నకిలీ విత్తనాల నివారణకు పోలీసు వ్యవసాయ అధికారులతో రాష్ట్ర, జిల్లా ,మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
6.చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్ చల్
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం లో ఏనుగుల మంద హల్ చల్ చేసింది.మండపేట, కోటూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద సుమారు 30 ఏనుగుల గుంపు రోడ్డు పై పరుగులు తీశాయి.
7.తిరుమల సమాచారం
తిరుమలలో మొదటి మూడు రోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది మంగళవారం 7,010 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
8.17 నుంచి గ్రూప్ 1 ఇంటర్వ్యూ లు
గ్రూప్ ఫోన్ సర్వీసెస్ ఇంటర్వ్యూలు ఈనెల 17 నుంచి జరగనున్నాయి.అన్ని పనిదినాల్లో విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
9.తెలంగాణ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
10.బిర్లా ఇన్ స్టిట్యూట్ లో ఎంసీఏ ప్రవేశాలు
దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2021-22 అకడమిక్ ఇయర్ కుగాను ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
11.టీకాల పై మేథో హక్కు రద్దు చేయాలి
కరోనా వైరస్ పై సమిష్టి పోరు కు మీతో హక్కులను రద్దు చేయాలన్న భారత్ ,దక్షిణాఫ్రికా ప్రతిపాదనలకు ఐదు దేశాల తో కూడిన బ్రిక్స్ మద్దతు ఇచ్చింది.
12.గవర్నర్ తమిళిసైతో సీఎం భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తో పాటు గవర్నర్ పుట్టినరోజు కావడంతో ఆమెకు కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
13.విదేశీ టీకాల రాకకు లైన్ క్లియర్
భారత్ లో తల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది విదేశీ ప్రక్రియల్లో డి సీ జీ ఐ మార్పులు చేసింది.
14.పీలేరు జైలుకు జడ్జి రామకృష్ణ తరలింపు
జడ్జి రామకృష్ణ చిత్తూరు జిల్లా నుంచి ఉదయం పీలేరు సబ్ జైలుకు తరలించారు.తండ్రికి ప్రాణహాని ఉందంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గో స్వామికి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేయడంతో ఆయనను వేరే జైలుకు తరలించారు.
15 భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.సీబీఎస్సీ ఇంటర్ పరీక్షలు రద్దు
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం కారణంగా విద్యార్థుల ఆరోగ్యం భద్రత దృశ్య సిబిఎస్సి 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
17.పరీక్షలు రద్దు చేయాలి : లోకేష్
కరోనా తీవ్రత దృష్ట్యా ఏపీలోనూ 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు.
18.మిజోరాం ను వణికిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ప్లూ
మిజోరం రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది.
ఈ ఫ్లూ ధాటికి ఆ రాష్ట్రంలో దాదాపు 4800 పందులు మృత్యువాత పడ్డాయి.విదేశాల నుంచి పందులను దిగుమతి చేసుకోవడం వల్ల ఈ వ్యాధి ప్రబలి నట్లు మిజోరాం అధికారులు పేర్కొన్నారు.
19.భారత్ విమానాలపై నిషేధం ఎత్తివేత
భారత్ తో పాటు, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, దక్షిణాఫ్రికా విమానాలపై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రకటించింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,900.