1.ఆషాడం బోనాలు ప్రారంభం
హైదరాబాద్ నగరంలో ఆషాడం బోనాల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలైంది.
2.ఉద్యోగ ఖాళీల పై అత్యవసర సమీక్ష
తెలంగాణలో త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆర్థిక శాఖ వేగం పెంచింది.ఈ మేరకు ఈరోజు ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఉదయం 10 నుంచి 12:30 వరకు శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
3.హెచ్సీయూలో ఎంటెక్ స్పెషల్ కోర్స్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2021 22 విద్యా సంవత్సరానికి కొత్త కోర్సును ప్రవేశ పెట్టనున్నారు.వర్సిటీలోని సెంటర్ ఫర్ మోడల్ రేషన్ అండ్ డిజైన్ ఆధ్వర్యంలో మల్టీ డిసిప్లినరీ 4 సెమిస్టరు కలిగిన ఎంటెక్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ కోర్సు ప్రారంభించనున్నారు.దీనికి ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
4.తిరుమలలో భక్తుల ధర్నా స్పందించిన టీటీడీ
తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు స్వీకరించిన కారణంగా టీటీడీ అదనపు ఈవో కార్యాలయం వద్ద భక్తులు ధర్నాకు దిగిన ఘటనపై టిడిపి స్పందించింది.తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులతో దర్శనాలు జారీచేయడం దుష్ప్రచారమే అని టిటిడి అధికారులు తెలిపారు.నిబంధనల మేరకు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలు పరిగణలోకి తీసుకుంతున్నమని అన్నారు.
5.టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎంపి త్రి పై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కసరత్తు మొదలు పెట్టారు దీనిలో భాగంగానే ఈరోజు టిటీడీపీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు.
6.కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం ఖండించిన కోదండరాం
కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ అధినేత కోదండరాం తీవ్రంగా ఖండించారు.
7.జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
ఏపీ సీఎం జగన్ కు ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు.రాయలసీమ ఎత్తిపోతల పథకం పై టిడిపి ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రకాశం జిల్లాకు అన్యాయం జరిగిందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
8.ఈ నెల 26న చలో ఢిల్లీ
శ్రీశైల కు 50శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్తో ఈనెల 26 ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు బీసీ సంక్షేమ నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.
9.రేపు ఎల్లమంద లో కత్తి మహేష్ అంతక్రియలు
సినీ రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్ర వారి పాలెం మండలం ఎల్లమంద ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
10.వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ శాఖ ఐ ఎండి కన్న బాబు తెలిపారు.ఈ ప్రభావంతో ఈరోజు రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
11.రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమించిన ట్విట్టర్
ట్విట్టర్ ఎట్టకేలకు భారత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రారంభించింది.భారత్ నిబంధనలకు అనుగుణంగా భారత దేశంలో రెసిడెంట్ ఆఫీసర్ నియమించినట్లు ప్రకటించింది.
12.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 41,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.శశికళ పిటిషన్ పై 18న విచారణ
అన్న డిఎంకె పార్టీ ని హస్తగతం చేసుకునే దిశగా ఆ పార్టీ బహిష్కృత మహిళా నేత శశికళ ప్రయత్నిస్తున్నారు.దీనిలో భాగంగానే అన్నాడీఎంకే నేతలు నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లదంటూ ప్రకటించాలని ఆమె కోర్టులో పిటిషన్ వేశారు దీనిపై ఈనెల 18న విచారణ జరగనుంది.
14.హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం : కోదండరాం
హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు.
15.హుజురాబాద్ లో పాదయాత్ర చేస్తా : ఈటెల
హుజూరాబాద్ నియోజకవర్గం లో పాదయాత్ర చేపట్టానని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రకటించారు.
16.ఫ్యాన్స్ తో రజనీ కాంత్ భేటీ
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన అభిమాన సంఘం మక్కమ్ మండ్రం కార్యదర్శులతో సోమవారం భేటీ కానున్నారు.
17.తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ శుభాకాంక్షలు
భాగ్యనగరంలో ఆషాడమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
18.ఏపీలో కరోనా
గడచిన 24 గంటలో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2,925 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.పోలవరం కు జగన్
ఈ నెల 14న ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు ను సందర్శించనున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,810
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,810
.