1.నేటి నుంచి డిజిటల్ ఓటర్ కార్డులు
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచి దేశవ్యాప్తంగా డిజిటల్ ఓటర్ కార్డులు జారీ చేస్తున్నారు మొబైల్ నుంచి డిజిటల్ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
2.వాక్సిన్ కాల్స్ కి స్పందించవద్దు
కోవిడ్ టీకా ఇస్తున్నామని, ఆధార్ ఓటిపి నంబర్లు చెప్పాలని వచ్చే మోసపూరిత కాల్స్ పై జాగ్రత్తగా ఉండాలని సీనియర్ సిటిజన్స్ కు కేంద్రం సూచించింది.
3.నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
నేడు వైసీపీ పార్లమెంటరీ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.త్వరలోనే జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.
4.వింత వ్యాధితో ఒకరు మృతి
అంతుచిక్కని వింత వ్యాధి కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలో జనాలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.తాజాగా దెందులూరు మండలం కొమిరేపల్లి కి చెందిన కౌ లు రైతు కాలి ఏడుపాదం ఈ వింత వ్యాధి కారణంగా మృతి చెందారు.
5.చిన వెంకన్న కు బంగారు సింహాసనం
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కి నిత్య కళ్యాణం నిమిత్తం కృష్ణ జిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన పర్వతనేని పాండురంగారావు, రాధిక దంపతులు 12 లక్షల రూపాయల విలువైన బంగారు సింహసనం ను స్వామి వారికి బహూకరించారు.
6.ఏపీలో కరోనా
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా 158 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
7.మొసళ్ళ పార్క్ పునః ప్రారంభం
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒడిశాలోని భితర్కానిక మొసళ్ల పార్క్ లో మొసళ్ల గణన తరువాత తిరిగి ప్రారంభించారు. 8.రష్యా టీకాకు పాక్ అనుమతి
రష్యా రూపొందించిన కరోనా టీకా స్పూత్నిక్ – వి కి పాక్ అనుమతించింది.
9.ఖరీదైన కారు కొన్న యువ హీరో
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కొత్త కారు కొనుగోలు చేశారు.ఈ మేరకు తాను కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారును సోషల్ మీడియా లో షేర్ చేశాడు.ఈ కారు విలువ 2 కోట్లు
10.అంతర్వేది రథానికి ట్రైల్ రన్
తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది పుణ్యక్షేత్రం లో నూతన రథానికి అధికారం ట్రైల్ రన్ నిర్వహించారు.
11.బ్రెయిన్ డెడ్ అయిన ఆశా వర్కర్ మృతి
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెను మాకకు చెందిన ఆశా కార్యకర్త బొక్కా విజయలక్ష్మి కోవిడ్ వాక్సిన్ తీసుకుని బ్రెయిన్ డెడ్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా ఆమె మృతి చెందారు.
12.నేడు సుప్రీంలో పంచాయితీ తీర్పు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది.
13.నేటి నుంచి ప్రవేటు ఆసుపత్రి సిబ్బందికి కరోనా టీకా
ప్రవేటు ఆసుపత్రుల్లో ని సిబ్బందికి నేటి నుంచి కరోనా టీకా వేయించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
14.రామ మందిర నిర్మాణానికి 1100 కోట్లు
అయోధ్య లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణానికి దాదాపు 1100 కోట్లు పైగా ఖర్చు అవుతుంది అని అయోధ్య రామమందిర ట్రస్ట్ పేర్కొంది.
15.లాగవుట్ సమస్యపై ఫేస్ బుక్ స్పందన
తమ ప్రమేయం లేకుండానే ఫేస్ బుక్ లో లాగవుట్ అయినట్టు సోషల్ మీడియా లో యూజర్స్ పోస్టింగ్స్ పెట్టడం పై ఫేస్ బుక్ స్పందించింది.దీనిని తాము గుర్తించి సరి చేశామని, ఈ ఇబ్బందికి క్షమించాలి అని ఫేస్ బుక్ వివరణ ఇచ్చింది.
16.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసగం
72 వ గణతత్రం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్ర పతి రామనాథ్ కొవింద్ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రసంగించనున్నారు.ఇది ఆలిండియా రేడియో లో ప్రసారం అవుతుంది.
18.చిరుత దాడిలో జింక మృతి
చిరుత దాడిలో జింక మరణించిన సంఘటన నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం పాంగ్రి సమీపంలో చోటు చేసుకుంది.
19.తెలంగాణ కు ఎస్టీ గురుకుల న్యాయ కళాశాల
తెలంగాణ కు ఎస్టీ న్యాయ గురుకుల కళాశాల మంజూరు అయ్యింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,320 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,320.