న్యూస్ రౌండప్ టాప్ 20

1.విరాళాలు ఇవ్వొద్దు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

అయోధ్య రామ   విరాళాలు ఇవ్వొద్దు అంటూ

టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 Andhra And Telangana News Breaking Headlines, Andhra Pradesh Headlines, Breaking-TeluguStop.com

2.తెలంగాణ సీఎం మార్పు పై జగ్గారెడ్డి కామెంట్స్

Telugu Andhra Pradesh, Ap Panchayat, Ashok Gehlot, Cm Jagan, Goodsdoor, Gold-Lat

కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్షన్ లోనే తెలంగాణ సీఎం మార్పు జరుగుతోందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్ చేశారు.

3.గ్రేటర్ ను మూడు భాగాలుగా విభజించాలి

గ్రేటర్ కాంగ్రెస్ ను మూడు భాగాలుగా విభజించాలి అని ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన గ్రేటర్ కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు హైదరాబాద్, మల్కాజ్ గిరి , సికింద్రాబాద్ లకు కొత్త అధ్యక్షులను నియమించే అలోచనలో ఉన్నారు.

4.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 226 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

5.పిఆర్సీ కోసం నిరసన దీక్ష

వేతన సవరణ కోరుతూ ఈ నెల 23 న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్షను చేపట్టనున్నట్లు పెన్షనర్స్ జేఏసి ప్రకటించింది.

6.ఎమ్మెల్సీ ఎన్నికల పై ఠాకూర్ సమీక్ష

Telugu Andhra Pradesh, Ap Panchayat, Ashok Gehlot, Cm Jagan, Goodsdoor, Gold-Lat

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్ కు నేడు రానున్నారు.హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష చేయబోతున్నారు.

7.భగీరథ వాటర్ బాటిళ్లు

ఖనిజలవణాలు పుష్కలంగా ఉండే మిషన్ భగీరథ నీటి తో తయారు చేసిన వాటర్ బాటిళ్లను ఇకపై ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో వినియోగించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

8.బిజెపి నేతల హౌస్ అరెస్ట్

Telugu Andhra Pradesh, Ap Panchayat, Ashok Gehlot, Cm Jagan, Goodsdoor, Gold-Lat

చలో డీజీపీ ఆఫీస్ ముట్టడికి పిలుపు ఇచ్చిన బీజేపీ నేతలను విజయవాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

9.స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టుకు

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

10.విశాఖ నుంచి పరిపాలన

త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కాబోతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.

11.జనసేన పీయేసీ సమావేశం

నేడు జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది.నేడు తిరుపతిలో పవన్ పర్యటన ఉన్న  నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించబోతున్నారు.

12.రేషన్ పథకం వాహనాలను ప్రారంభించిన జగన్

Telugu Andhra Pradesh, Ap Panchayat, Ashok Gehlot, Cm Jagan, Goodsdoor, Gold-Lat

నేడు విజయవాడ లో ఇంటింటికి రేషన్ అందించేందుకు కొనుగోలు చేసిన వాహనాలను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.

13.గో మహా యాత్ర

ఆవును జాతీయ రాణిగా ప్రకటించాలంటూ 24న గో మహా యాత్రను నిర్వహించబోతున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యుడు శివ కుమార్ తెలిపారు.

14.50 కోసం గొడవ వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో రూ 50 కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు.ఓ పాల డైరీ లో పనిచేస్తున్న వ్యక్తుల మధ్య ఈ గొడవ చోటు చేసుకుంది.

15.ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు నేటి నుంచి

ఎంసెట్ 2020 ఇంజనీరింగ్ విభాగం రెండో దశ అడ్మిషన్స్ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది.

16.ఏపీ డీజీపీ విరాళం

Telugu Andhra Pradesh, Ap Panchayat, Ashok Gehlot, Cm Jagan, Goodsdoor, Gold-Lat

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పదివేల రూపాయలు విరాళం ప్రకటించారు.

17.30 వరకు ఇళ్ల పట్టాలు పంపిణీ

ఈనెల 30వరకు ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.

18.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15, 223 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

19.కాంగ్రెస్ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ ?

రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.ఆయనకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Andhra Pradesh, Ap Panchayat, Ashok Gehlot, Cm Jagan, Goodsdoor, Gold-Lat

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,600

24 చెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,600

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube