1.పుత్తూరులో ఏనుగు ల భయం
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం లోని ఎగువ గులురులో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తున్నాయి.ఇవి పంటపొలాలను ధ్వంసం చేస్తుండడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు.
2.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3.15 లోపు గ్రేటర్ కొత్త పాలక మండలి
గ్రేటర్ కొత్త పాలక మండలి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి గ్రేటర్ 2 కౌన్సిల్ 15వ తేదీలోపు కొలువు తీరబోతోంది.
4.జ్యోతిష్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజీ సైన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జ్యోతిష్యం వాస్తు హస్త రేఖా శాస్త్రం లో భాగంగా జ్యోతిష్యం ప్రవీణ, జ్యోతిష్య విశారద కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఆసక్తిగలవారు 9246348354, 9989088111 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
5.18 నుంచి ప్రెస్ క్లబ్ లో బస్ పాస్ కౌంటర్
జర్నలిస్టుల బస్సు పాస్ కోసం ఈనెల 18 నుంచి 23 వరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడి వెంకటేశ్వర్లు తెలిపారు.
6.రేపట్నుంచి రెవెన్యూ ప్రత్యేక ట్రిబ్యునళ్ళు
రెవెన్యూ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
7.397 వ రోజుకి చేరిన అమరావతి ఉద్యమం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళా రైతులు రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు 397 రోజుకు చేరాయి.
8.బిజెపి కోర్ కమిటీ సమావేశం
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన ఆదివారం విశాఖలో కోర్ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించబోతున్నారు.
9.కిసాన్ ర్యాలీ
ఢిల్లీలో జరుగుతున్న రైతులు ఉద్యమానికి సంఘీభావంగా ఆలిండియా కిసాన్ సంగ్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 23న చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ప్రకటించింది.
10.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.జూ పార్క్ లో బర్డ్ ఫ్లూ
దేశ రాజధాని ఢిల్లీలోని జూ పార్క్ లో ప్రవేశించిన జూ పార్క్ లో మృతి చెందిన గుడ్ల గూబ నమూనాలను పరీక్షించగా ఈ విషయం తేలింది.
12.జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పెంపు
ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనున్న జేఈఈ-మెయిన్ మొదటి విడత పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది.
13.డిగ్రీ లో ప్రవేశాలక 21 వరకు అవకాశం
ఏపీ లోని కృష్ణ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లో మొదటి విడత డిగ్రీ ప్రవేశాల కు ఈనెల 21 వరకు అవకాశం కల్పించారు.
14.కాకినాడలో 18న ఉద్యోగ మేళా
తూర్పుగోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించడంలో భాగంగా రేపు కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయం వద్ద ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ లచ్చారావు తెలిపారు .
15.బ్రెజిల్ లో కొత్త స్ట్రెయిన్
కరోనా వైరస్ పరకాల రూపాల్లో వృద్ధి చెందుతోంది.కొత్త స్ట్రెయిన్ ను బ్రెజిల్ లో గుర్తించగా ఇప్పుడు మరో కొత్త రకాన్ని గుర్తించారు.
15.క్యూబా పై అమెరికా ఆంక్షలు
శోభ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆ శాఖ మంత్రి పై అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించింది.
16.మహారాష్ట్ర లోని తొమ్మిది జిల్లాల్లో బర్డ్ ఫ్లూ
మహారాష్ట్ర లోని తొమ్మిది జిల్లాల్లో కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ గుర్తించినట్లు కేంద్రం ప్రకటించింది.
17.మలబార్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం
మలబార్ ఎక్స్ ప్రెస్ లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.కేరళలోని తిరువనంతపురం జిల్లా వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
18.నేను తెలుగింటి అల్లుడినే : సోనూ సూద్
తన భార్య సోనాలి సూద్ తెలుగింటి ఆడపడుచు అని, నేను తెలుగింటి అల్లుడిని అంటూ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ వ్యాఖ్యానించారు.
19.ఆర్కిటెక్చరల్ బోర్డును ఏర్పాటు చేసిన ఏపీ
ఆర్కిటెక్చరల్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,900
.