1.ఉద్యోగ సంఘాలతో కేసీఆర్
ఈనెల 13వ తేదీన సంఘాల నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు.వేతన సవరణ, పదవీ విరమణ వయస్సుకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించబోతున్నారు.
2.అఖిల ప్రియ కు బెయిల్ నిరాకరణ
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ నిరాకరించింది.
3.పరారీలో నే భార్గవ్ రామ్
తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులు ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలో ఉన్నారు.ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
4.డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల
యూజీ ,పీజీ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆదివారం విడుదల చేసింది.
5.పులి సంచారం బోన్ల ఏర్పాటు
తెలంగాణలోని కొమురం భీం జిల్లాలో పెద్ద పులి సంచారం తో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో, అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు.
6.17న పల్స్ పోలియో వాయిదా
దేశవ్యాప్తంగా ఈ నెల 17న నిర్వహించాల్సిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది.
7.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 351 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి లో ఖాళీ అయిన స్థానానికి అధికార పార్టీ వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసింది.మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ను అభ్యర్థిగా జగన్ ప్రకటించారు.
9.ఫ్యాన్స్ కి రజిని లేఖ
” దయచేసి నన్ను నొప్పించకండి ” అంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.రాజకీయ పార్టీ పెట్టాలంటూ ఆయనపై ఒత్తిడి చేస్తున్న తరుణంలో ఈ లేఖ రాశారు.
10.జపాన్ లో కొత్త కరోనా
జపాన్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది.గతంలో వచ్చిన వైరస్ ల కంటే ఇది భిన్నంగా ఉందని అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
11.కరోనా ‘ సెస్ ‘
కొత్తగా ‘ కరోనా సెస్ ‘ ను ముందుకు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
12.నూతన వ్యవసాయ చట్టం పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
నూతన వ్యవసాయ చట్టాలను మీరు నిలుపుదల చేస్తారా ? మమ్మల్ని చేయమంటారా ? అంటూ కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
13.బర్డ్ ఫ్లూ కలకలం
మహారాష్ట్రలోని పర్బాని జిల్లాలోని మురుంబా గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్ లో సుమారు 800 కోళ్లు మృతి చెందాయి.బర్డ్ ఫ్లూ కారణంగానే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
14.జవాన్ ను చైనా కు అప్పగించిన భారత్
వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా జవాను ను భారత సైన్యం సోమవారం తిరిగి ఆ దేశానికి అప్పగించింది.
15.ఏపీ ఎన్నికల సంఘం జేడీపై వేటు
ఏపీ ఎన్నికల సంఘం జేడీ జీవి సాయిప్రసాద్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.ఆర్టికల్ 243 రెడ్ విత్ , ఆర్టికల్ 324 ప్రకారం సాయి ప్రసాద్ ను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
16.చౌటప్ప నాయుడు గా ఎన్టీఆర్
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ‘ చౌడప్ప నాయుడు ‘ అనే టైటిల్ ను పెట్టాలనే ఆలోచనలు ఆ చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం.
17.కరోనా వైరస్ తొలి కేసు
పసిఫిక్ మారుమూల దేశమైన మైక్రోనేషియా లో సోమవారం తొలి కొవిడ్ కేసు నమోదయ్యింది.
18.బీజేపీ రథ యాత్ర
ఏపీలో దేవాలయాల పరిరక్షణ కు రథయత్ర చేపట్టాలనే ఆలోచనలో బీజేపి ఉంది.విజయనగరం జిల్లాలోని రామతీర్థం నుంచే ఈ యాత్ర చేపట్టాలని బిజెపి నాయకులు ప్లాన్ చేస్తున్నారు.
19.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్త గా 16, 311 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల ధర – 48,310
24 క్యారెట్ల పది గ్రాముల ధర – 49,310
.