1.పోలీసుల పై ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ పోలీసులు పార్టీ కండువాలు వేస్తున్నారు అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
2.మహేష్ సోదరుడికి అంత్యక్రియలు పూర్తి
సినీ హీరో మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం లో ముగిశాయి.
3.భారత్ లో కరోనా
కలిసిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,59,632 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
4.చంద్రబాబు పై రోజా కామెంట్స్
వైసీపీ ఇచ్చిన షాక్ తో టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం చుట్టూ తిరుగుతున్నారని నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.
5.కరోనా పై ప్రధాని సమీక్ష
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
6.జనసేన సమావేశం వాయిదా
కరోనా వైరస్ ప్రభావం దృష్టి ఈరోజు జరగవలసిన జనసేన కార్యవర్గ సమావేశం వాయిదా పడింది.
7.ఉద్యోగ జేఏసీ సమావేశం వాయిదా
నేడు ఏపీలో జరగాల్సిన ఉద్యోగ జేఏసీ సమావేశం వాయిదా పడింది.
8.తెలంగాణ శాసనసభ పక్ష సమావేశం
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభ పక్ష అత్యవసర సమావేశం మొదలైంది.
9.తెలంగాణకు వర్ష సూచన
నేడు తెలంగాణ లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
10.తమిళనాడు లో లాక్ డౌన్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తమిళనాడు లో లాక్ డౌన్ విధించారు.
11.టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కి కరోనా
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
12.నేడు తెలంగాణకు అసోం సీఎం
నేడు తెలంగాణకు అసోం సీఎం హిమంతా బిస్వా శర్మ రానున్నారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఆయన నిరసన దీక్షలో పాల్గొననున్నారు.
13.భట్టి విక్రమార్క పాదయాత్ర జగ్గారెడ్డి దీక్ష వాయిదా
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన నిరసన దీక్ష వాయిదా పడ్డాయి.
14.భారత్ లో ఒమి క్రాన్
ఒమిక్రాన్ కేసులు భారత్ లో 3,623 కు చేరుకున్నాయి.
15.వైసీపీ పై అచ్చెన్న విమర్శలు
వైసీపీ నేతలు అధికార మధం తో వీర్రవీగుతున్నారు అని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
16.ప్రభుత్వ సలహాదారుడు గా జ్ఞానేంధ్ర రెడ్డి
ఏపీ ప్రభుత్వ సలహాదారుడు గా జ్ఞానేంద్ర రెడ్డి ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
17.వైఎస్సార్ విగ్రహానికి నిప్పు
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొప్పెర పాలెం లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
18.లాక్ డౌన్ విధించే ఆలోచన లేదు : ఢిల్లీ సీఎం
ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
19.కరోనా పై మంత్రి హరీష్ రావు సూచనలు
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మంత్రి హరీష్ రావు సూచించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,610
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,610
.