1.జపాన్ సదస్సుకు కేటీఆర్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించబోతున్న ప్రపంచ టెక్నాలజీ గవర్నెన్స్ సదస్సు – 2021 కి హాజరు కావాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది.ఏప్రిల్ 5 7 తేదీల్లో జపాన్ లోని టోక్యోలో ఈ సదస్సు జరుగుతుంది.
2 మంచిర్యాల లో పులి సంచారం
మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం కొత్తపల్లి అటవీ ప్రాంతంలో కలకలం రేపుతోంది.పులి బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
3.పేకాడుతూ పట్టుబడ్డ ఏ ఎస్సై, కానిస్టేబుల్
విధినిర్వహణలో పోలీసులు పేకాట ఆడుతూ పట్టుబడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక ఏ ఎస్ ఐ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు.
4.ఏపీ హైకోర్టు సీజే గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరుణ్ కుమార్ గురుస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
5.ఏపీలో ఆఫ్ లైన్ లోనే ఇంటర్ అడ్మిషన్స్
రాష్ట్రంలో ఇంటర్ అడ్మిషన్లను ఆఫ్ లైన్ లోనే నిర్వహించాలని నిర్ణయించింది.
6.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
7.ఫైజర్ తీసుకున్న పోర్చుగల్ నర్స్ మృతి
ఫోర్టోలోని పోర్చుగీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆసుపత్రి చిన్న పిల్లల విభాగం లో నర్సుగా పనిచేస్తున్న సోనియా అసివిడో (41) డిసెంబర్ 30న ఫైజర్ తీసుకున్నారు.ఈనెల 1న సోనియా ఇంట్లోనే మరణించినట్లు ఆమె తండ్రి ప్రకటించారు.
8.అర్చకుడిని పెళ్లాడితే మూడు లక్షలు
ఆలయాల్లో అర్చకత్వం చేసే బ్రాహ్మణ యువకులను వివాహమాడే వధువుకు కర్ణాటక ప్రభుత్వం మూడు లక్షలు ప్రోత్సాహక బహుమతులను అందజేయనుంది.
9.71 కి చేరిన కొత్త స్ట్రెయిన్ కేసులు
దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు 71 కి చేరాయి.
10.యూకే ప్రధాని భారత పర్యటన రద్దు
యూకేలో కొత్త స్ట్రైన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.
11.ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 29న ప్రారంభం కానున్నాయి.తొలి విడత సమావేశాలు 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి.ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడతారు.
12.బడికి వెళ్లే బాలికలకు రోజుకు 100
బాలికా విద్యను ప్రోత్సహించేందుకు అస్సాం ప్రభుత్వం పాఠశాల తరగతులకు హాజరయ్యే విద్యార్థినిలకు రోజుకు వంద రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించింది.
13.బ్రిటన్ లో కఠిన లాక్ డౌన్
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.బ్రిటన్ లో ఫిబ్రవరి నెల మధ్య వరకు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని బోరిస్ ప్రకటించారు.
14.సోమిరెడ్డికి కరోనా పాజిటివ్
నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా వైరస్ ప్రభావం కి గురయ్యారు.
15.తెలంగాణ లో కరోనా
తెలంగాణలో గడచిన 24 గంటల్లో కొత్తగా 417 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
16.విశాఖ ఫార్మాసిటీ లో అగ్ని ప్రమాదం
విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీ లో అగ్ని ప్రమాదం సంభవించింది.జె పి ఆర్ ల్యాబ్స్లో మంగళవారం అర్ధరాత్రి మూడు సార్లు పేలుళ్లు సంభవించాయి.
17.మాజీ హాకీ క్రీడాకారుడు కిడ్నాప్
సికింద్రాబాద్ బోయిన్పల్లి లో కిడ్నాప్ కలకలం సృష్టించింది మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ ఆయన సోదరులను దుండగులు అపహరించారు.ఐటీ అధికారుల మంటూ మూడు కార్లలో వచ్చిన దుండగులు ఈ కిడ్నాప్ కు పాల్పడ్డారు.
18.భారత్ లో బర్డ్ ఫ్లూ
భారత్ లో బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి.దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల కోళ్లు, పెద్ద ఎత్తున నెమళ్లు, కాకులు మృతి చెందడంతో కలకలం రేగుతోంది.
19.కృష్ణాజిల్లా చిన్నారికి సోనూసూద్ సాయం
కృష్ణాజిల్లా తిరువూరు మండలంలోని ము నుకుళ్ళ కు చెందిన కొంగల వెంకటేశ్వర్లు సరస్వతి దంపతుల కుమార్తె 15 నెలల వయస్సు ఉన్న వర్షిత గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండడం తో వారికి అతడు సోను సూద్ సహాయం చేశారు.ఆపరేషన్ కు అవసరమైన అన్ని ఖర్చులు భరించేందుకు ఆయన ముందుకు వచ్చారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 50,340
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,340
.