1.కొమ్రం భీం జిల్లాలో పెద్దపులి
కొమ్రం భీమ్ జిల్లాలోని బెజ్జూర్ మండలం లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.పంట చేల కు వెళ్ళిన రైతులకు పులి కనిపించడంతో బెంబేలెత్తిపోతున్నారు.
2.సంక్రాంతి తర్వాత ఇంటర్ తరగతులు
సంక్రాంతి తర్వాత తెలంగాణలో ఇంటర్మీడియట్ తరగతులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
3.సన్ ప్లాన్ నిధుల దుర్వినియోగంపై నోటీసులు
తెలంగాణలో సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగంపై షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ కు జాతీయ ఎస్సీ ,ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది
4 పాతబస్తీలో తుపాకితో వ్యక్తి హల్చల్
పాతబస్తీలో జకీర్ అనే వ్యక్తి తుపాకీతో హల్చల్ చేశాడు.ఓ కేఫ్ లో కూర్చుని టీ తాగుతున్న సమయంలో జకీర్ కు ఆయుబ్ ఖాన్ అనే మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో జకీర్ తుపాకీతో ఆయుబ్ ను బెదిరించాడు.
5.సీఎం ను చంపితే పది లక్షలు ఇస్తాం అంటూ పోస్టర్
సీఎం చంపితే 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తాం అంటూ పంజాబ్ లో శనివారం ఓ పోస్టర్ ప్రత్యక్షం అవ్వడం సంచలనంగా మారింది.
6.ఎన్నికల ఖర్చు తెలవకపోతే అనర్హతవేటు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సకాలంలో ఎన్నికలు ఖర్చు వివరాలను అందించాలని, లేకపోతే అనర్హత వేటుకు గురైయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సూచించారు.
7.దేశవ్యాప్తంగా డ్రై రన్ సక్సెస్
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ని 125 జిల్లాలో 286 సైట్లలో నిర్వహించిన డ్రై రన్ విజయవంతమైందని కేంద్రం ప్రకటించింది.
8.తిరుమల సమాచారం
తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ లను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది.
9.కోదండరామ్ దీక్ష
బతుకు చెరువును నిలబెట్టాలని, తెలంగాణను కాపాడాలన్న నినాదం తో టీ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం రెండు రోజుల నిరాహార దీక్షను ఆదివారం చేపట్టారు.
10.ఉర్దూ అకాడమీ డైరెక్టర్ అరెస్ట్
ఏపీ ఉర్దూ అకాడమీ అధికారులను సిఐడి పోలీసులు శనివారం అరెస్టు చేశారు.ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులకు జీతాలు పెంపు, ఇతర ఆర్థిక అక్రమాలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అధికారులు అధికారులు అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ, సూపరింటెండెంట్ షేక్ జాఫర్ ను అరెస్ట్ చేశారు.
11.రేపటి నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్
ఏపీ లోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొత్తం నాలుగు వేల సీట్లకు కౌన్సిలింగ్ రేపు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
12.అమెరికాకు రజనీకాంత్
మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్లేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సిద్ధమవుతున్నారు.
13.అమెరికా కు ఇరాన్ హెచ్చరిక
ఇజ్రాయిల్ పన్నే ఉచ్చులో పడవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ హెచ్చరించింది.
14.కో ఆప్షన్ కేక వినియోగానికి డి సి జీ ఐ అనుమతి
కొవిడ్ నిరోధానికి దేశంగా హైదరాబాదుకు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్ లో ఆమోదం లభించింది.
15.కృష్ణా బోర్డు తరలించాలని కోరుతూ లేఖ
ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కృష్ణానది యాజమాన్య బోర్డును విశాఖకు తరలించాలని ఏపీ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి బోర్డుకు లేఖ రాశారు.
16.భారత్ లో కరోనా
దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 18,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం
ఏపీలో ఆలయాల విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది.తాజాగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న సీతారామ మందిరంలో సీతమ్మ విగ్రహం ధ్వంసం అయింది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
18.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.జమ్మూకాశ్మీర్ లో తెలుగు జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్ లో తెలుగు ఆర్మీ జవాను అమరుడయ్యాడు.చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం లోని పనపాకం పంచాయతీ గడ్డకింద పల్లి కి చెందిన రెడ్డప్ప నాయుడు భారత సరిహద్దుల్లో శనివారం పహారా కాస్తున్న సమయంలో చలి తీవ్రత ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
20.బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,060
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -50,060
.