1.పంట పొలాల్లో ఆడ శిశువు
సూర్యపేట జిల్లాలోని చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో గత అర్థరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో వదిలి వెళ్లడం కలకలం రేపింది.ఈరోజు ఉదయం కొంతమంది గుర్తించేెసరికే ఆ శిశువు మృతి చెందింది.
2.పెద్దపల్లి లో చిరుతపులి సంచారం
పెద్దపల్లి జిల్లా లోని గోదావరిఖని మల్కాపూర్ శివారులో గోదావరి నది తీరాన రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది.
3.బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కౌన్సిలింగ్
తెలంగాణలోని కళాశాలలో ప్రవేశాలకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.నేటి నుంచి 4వ తేదీ వరకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించబోతున్నారు.
4.మధిర మాజీ ఎమ్మెల్యే మృతి
ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య (87) అనారోగ్యంతో మృతి చెందారు.
5.20 నుంచి పూర్తిస్థాయిలో సిటీ బస్సు సర్వీసులు
ఈనెల 20వ తేదీ తర్వాత నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులను పూర్తిస్థాయిలో తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది.
6.కేంద్ర మాజీ హోంమంత్రి కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత బూటాసింగ్ (86) కన్ను మూశారు.ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
7.కరోనా వాక్సిన్ డ్రై రన్ ప్రారంభం
దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ ప్రారంభమైంది.
8.మిస్సిడ్ కాల్ తో గ్యాస్ సిలిండర్ బుకింగ్
కేవలం ఫోన్ మిస్డ్ కాల్ తోనే ఎల్పిజి బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారుల అయినా – ,84549 55555 నంబర్కు మిస్సేడ్ కాల్ ఇస్తే రీఫిల్ సిలిండర్ బుక్ అవుతుందని ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది.
9.ఖర్జూర పండు లో బంగారం
ఖర్జూర పండ్లలో బంగారం పెట్టి తెచ్చిన వ్యక్తి ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.
సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇతను ఖర్జూర పండ్లలో పెట్టి 300 గ్రాముల బంగారం ఉంచి తీసుకువచ్చారు.ఈ బంగారం విలువ 15 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
10.ఉచితంగానే కరోనా టీకా
కరోనా వ్యాక్సిన్ దేశమంతా ఉచితంగానే అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు.
11.తెలంగాణలో కరోనా
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12.ఆస్ట్రేలియాలో నాగర్ కర్నూల్ యువతి మృతి
ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా కి వెళ్ళిన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం దిండి చింతలపల్లి కి చెందిన రక్షిత (22) ఆస్ట్రేలియా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
13.ఐదు నుంచి తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్ మ్యూజియం
Covid 19 నేపథ్యంలో 2020 మార్చి 13 నుంచి మూసివేసిన రాష్ట్రపతి భవన్ మ్యూజియాన్ని జనవరి 5 నుంచి తెరవనున్నట్టు రాష్ట్రపతి భవన్ కార్యాలయం తెలిపింది.
14.తండ్రయిన క్రికెటర్ ఉమేష్ యాదవ్
టీం ఇండియా పేసర్ ఉమేష్ యాదవ్ తండ్రయ్యాడు.అతని సతీమణి తాన్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
15.యూపీఐ చెల్లింపులకు చార్జీలు లేవు
డిజిటల్ చెల్లింపులు చేసే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ( యూపీఐ) ఫ్లాట్ ఫామ్ లలో చెల్లింపులు ఉచిత మేనని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.జనవరి 1 నుంచి డిజిటల్ చెల్లింపులకు చార్జీలు వసూలు చేస్తారన్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపింది.
16.రామతీర్థం లో హై టెన్షన్ భారీగా పోలీసు బలగాలు
ఏపీ లోని విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం ఆలయంలో విగ్రహం ధ్వంసమైన ఘటన ఇప్పుడు ఏపీలో కలకలం గా మారింది.వైసిపి, బిజెపి, టిడిపి కీలక నాయకులంతా ఇక్కడకు చేరుకోవడంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలను రంగంలోకి దించారు.
17.మరో క్రేజీ ప్రాజెక్ట్ లో సమంత
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎ పిక్ లవ్ స్టోరీ ‘ శాకుంతలం ‘ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న ట్లు ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది.
18.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,950
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,950
19.‘ పుష్ప ‘ ఐటెమ్ సాంగ్ లో దిశా పఠాని
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘ పుష్ప ‘ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ భామ దిశా పఠాని నటించబోతున్నట్లు తెలుస్తోంది.దీని కోసం ఆమె 1.5 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నట్లు టాక్.
20.మెగాస్టార్ ‘ లూసిఫర్ ‘ రీమేక్ లో సత్యదేవ్
మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ లూసిఫర్ ‘ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరో సత్యదేవ్ ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నారు.ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సత్యదేవ్ కలిసి దిగిన ఫోటో వైరల్ అయింది.