1.సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ధ్వంసం
ఏపీలో దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం అవుతున్న ఘటన లు సంచలనం సృష్టిస్తున్నాయి.తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్రీరామ్ నగర్ లో ఉన్న గణపతి ఆలయం లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
2.కాణిపాకంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు
ఏపీ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ల అన్ని రకాల ఆర్జిత సేవలను కొత్త సంవత్సరం కారణంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
3.కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ మృతి
కరోనా వైరస్ ప్రభావానికి గురై కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు.
4.ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ప్రభాస్ ఫ్యాన్స్ కు రాధే శ్యామ్ టీం న్యూ ఇయర్ సర్ప్రైజ్ ఇచ్చింది ఎవరికి తెలియకుండా సినిమా పోస్టర్ ను అర్ధరాత్రి సమయంలో విడుదల చేసింది.
5.రవితేజ ‘ ఖిలాడి ‘ పోస్టర్ విడుదల
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి ‘ సినిమా పోస్టర్ ను నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు విడుదల చేశారు.
6.కరోనా వాక్సిన్ అత్యవసర అనుమతి పై నేడు నిర్ణయం
దేశంలో కరోనా వాక్సిన్ అత్యవసర వినియోగానికి సంబంధించి ఈరోజు హైలెవల్ కమిటీ సమావేశం కాబోతోంది.ఈ సమావేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా , భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలకు సంబంధించిన టీకాల పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
7.భారత్ లో కరోనా
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20, 036 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.ఫైజర్ టీకాకు కు డబ్ల్యూహెచ్ వో ఆమోదం
ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగించుకునేందుకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చింది.
9.ఇంటర్ ప్రవేశ పరీక్ష గడువు పొడగింపు
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 ప్రతిభ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఉద్దేశించిన పరీక్ష దరఖాస్తు గడువును జనవరి 10 వరకు పొడిగించినట్లు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
10.తెలంగాణలో కరోనా
తెలంగాణ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 415 మందికి కరుణ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
11.677 మందికి రాష్ట్ర పోలీసు సేవా పథకాలు
విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్, ఏసీబీ , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అగ్ని మాపకం, ఎస్ పి ఎఫ్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం సేవా పథకాలను ప్రకటించింది.మొత్తం 677 మందిని ఎంపిక చేశారు.
12.ఫిబ్రవరి 15 వరకు ఫాస్టాగ్ గడువు పెంపు
జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ఈ సమయంలో టోల్గేట్ ల వద్ద వాహనాల రద్దీ నివారించడానికి, చెల్లింపులు సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ గడువు ను కేంద్రం ఫిబ్రవరి 15 వరకు పెంచింది.
13.హైకోర్ట్ సీజే గా జస్టిస్ హిమా కోహ్లీ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీని నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
14.ప్రభుత్వ కార్యాలయాలకు వెయ్యి ఈ వాహనాలు
ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి వీలుగా అద్దె ప్రాతిపదికన తెలంగాణలో వెయ్యి వాహనాలను సమకూర్చనున్నారు.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
15.బిజెపిలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు స్వయంగా ఆయన ప్రకటించారు.
16.కరుణ్ కాన్సెప్ట్ అధినేత అరెస్ట్
అరుణ్ కాన్సెప్ట్ అధినేత ఓ పార్టీ మీడియా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకు కరణ్ రెడ్డి ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.ఓ యువతిని నమ్మించి మోసం చేసిన సంఘటనలో రెడ్డితో పాటు ఆయన భార్య మానస రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు కావడం తో పోలీసులు అరెస్టు చేశారు.
17.ఆసియా లో అతిపెద్ద కోటీశ్వరుడు ఎవరంటే
ప్రముఖ చైనా వ్యాపారవేత్త బిలినియర్ జాంగ్ షాన్ షా న్ (66) హాస్యాలు ధనవంతుడిగా నిలిచారు.
18.చైనాకు పాకిన బ్రిటన్ వైరస్
కరుణ వైరస్ కొత్త స్ట్రెయిన్ బ్రిటన్ నుంచి చైనా కు పాకింది.అక్కడ ఓ విద్యార్థి కి స్ట్రెయిన్ లక్షణాలు ఉన్నట్లు స్వయంగా చైనా ప్రకటన చేసింది.
19.H1B వీసాలపై నిషేధం పొడిగింపు
వలస కార్మికుల పై నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పొడిగించారు.అమెరికాలో వర్క్ వీసాల పై తాత్కాలికంగా అమలవుతున్న నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
20.ఈరోజు బంగారం ధర
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం – 48,940
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -49,940
.